News March 1, 2025
చెన్నూర్: పురుగు మందు తాగి యువకుడి సూసైడ్

యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన చెన్నూర్ మండలంలో జరిగింది. సీఐ రవీందర్ కథనం ప్రకారం.. నాగపూర్ గ్రామానికి చెందిన గోపి డబ్బుల విషయంలో కొమ్మెర గ్రామానికి చెందిన మధుకర్ను కొట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన మధుకర్ ఇంటికి వచ్చి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
Similar News
News November 28, 2025
సిద్దిపేట: ఒకే మండలం నుంచి నలుగురు ఏకగ్రీవం

సిద్దిపేట జిల్లాలో నలుగురు సర్పంచ్ పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జగదేవపూర్ మం. బీజీ వెంకటాపూర్లో పరమేశ్వర్, మాందాపూర్లో ముత్యం, పలుగుగడ్డ నర్ర కనకయ్య, అనంతసాగర్లో కుమార్ను గ్రామాల అభివృద్ధి దృష్ట్యా గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నలుగురు బీసీ రిజర్వేషన్ కింద కేటాయించిన అభ్యర్థులే కావటం విశేషం. అయితే వారంతా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన సర్పంచులవటం మరో విశేషంగా చెప్పుకోవచ్చు.
News November 28, 2025
మచిలీపట్నం: మళ్లీ సేమ్ సీన్ రిపీట్..?

కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర కావొస్తుంది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, మంత్రి రవీంద్ర కలిసి ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా శంకుస్థాపన చేయలేదు. ఒకట్రెండు సార్లు ప్రెస్మీట్లలో కలిసి పాల్గొన్నారు. ఇద్దరు నేతల మధ్య సమన్వయ లోపంతో ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. కాగా గతంలోనూ మాజీ మంత్రి పేర్నినాని, ఎంపీ బాలశౌరికి అంతర్గత విభేదాలతో ఇదే పరిస్థితి ఉండటం గమనార్హం.
News November 28, 2025
సర్పంచ్ నుంచి MLAగా.. రాణించిన జిల్లా నేతలు..!

గ్రామ సర్పంచ్గా రాజకీయ జీవితం ప్రారంభించిన పలువురు నేతలు MLAలుగా రాణించారు. వేములవాడ మండలం రుద్రవరం గ్రామ సర్పంచ్గా పేరు తెచ్చుకున్న రేగులపాటి పాపారావు సిరిసిల్ల ఎమ్మెల్యేగా, గంభీరావుపేట వార్డు సభ్యుడిగా పనిచేసిన కటకం మృత్యుంజయం కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. జగిత్యాల జిల్లా అంతర్గాం సర్పంచ్గా పనిచేసిన సుద్దాల దేవయ్య నేరెళ్ల ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచి మంత్రిగా సేవలందించారు.


