News March 1, 2025
చెన్నూర్: పురుగు మందు తాగి యువకుడి సూసైడ్

యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన చెన్నూర్ మండలంలో జరిగింది. సీఐ రవీందర్ కథనం ప్రకారం.. నాగపూర్ గ్రామానికి చెందిన గోపి డబ్బుల విషయంలో కొమ్మెర గ్రామానికి చెందిన మధుకర్ను కొట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన మధుకర్ ఇంటికి వచ్చి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
Similar News
News March 26, 2025
రష్యా, ఉక్రెయిన్ మధ్య కీలక ఒప్పందం

రష్యా, ఉక్రెయిన్ కీలక ఒప్పందానికి వచ్చాయి. చమురు కర్మాగారాలు, రిఫైనరీలు, విద్యుత్ ప్లాంట్లు తదితర ఇంధన ఉత్పత్తి ప్రాంతాలపై దాడి చేసుకోరాదని అంగీకరించాయి. ఓ ప్రకటనలో రష్యా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇది 30 రోజుల కోసం చేసుకున్న తాత్కాలిక ఒప్పందమేనని, పరస్పర అంగీకారంతో మరింత పొడిగించేందుకు అవకాశం ఉందని పేర్కొంది. రెండు దేశాల్లో ఎవరు ఈ అంగీకారాన్ని ఉల్లంఘించినా ఒప్పందం రద్దవుతుందని వివరించింది.
News March 26, 2025
భర్త మందలించడంతో భార్య ఆత్మహత్య: నర్సీపట్నం సీఐ

నాతవరం మండలం ఎంబీ పట్నంలో మంగళవారం భర్త మందలించడంతో భార్య ఆత్మహత్యకు పాల్పడినట్లు నర్సీపట్నం సీఐ రేవతమ్మ తెలిపారు. కుమార్తె అల్లరి చేయడంతో తల్లి వెంకటలక్ష్మి కొట్టినట్లు తెలిపారు. కుమార్తెను ఎందుకు కొట్టావని భర్త గోవింద్ భార్యను మందలించాడన్నారు. అనంతరం గోవింద్ జీడి తోటలోకి వెళ్ళిపోగా మనస్తాపానికి గురైన వెంకటలక్ష్మి పెట్రోల్ పోసుకొని నిప్పు పట్టించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
News March 26, 2025
సీజన్ ముగిసిన.. రైతుకు దక్కని భరోసా!

నల్గొండ జిల్లాలో రైతు భరోసా కోసం రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. ఇప్పటివరకు యాసంగి సీజన్కు సంబంధించి మూడెకరాల లోపు 2, 76,694 మంది ఖాతాల్లో మాత్రమే ప్రభుత్వం నిధులు జమ చేసింది. మూడు ఎకరాలకు పైగా ఉన్న సుమారు 3. 30 లక్షల మంది రైతులు రైతు భరోసా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సీజన్ ముగిసినా ఎప్పుడు ఇస్తారోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.