News July 12, 2024

చెన్నూర్: విద్యుత్తు ఉప కేంద్రాన్ని ప్రారంభించిన MP, MLA

image

చెన్నూర్ పట్టణంలో నూతనంగా రూ.1.90 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన 33/11 కేవి విద్యుత్తు ఉప కేంద్రాన్ని శుక్రవారం ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డ వివేక్ వెంకటస్వామిలు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. విద్యుత్తు ఉప కేంద్రంలో శాఖ సిబ్బందికి అన్ని ఏర్పాట్లను త్వరలో పూర్తి చేస్తామని హామిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 18, 2025

నిర్మల్: 3 ప్రమాదాలు.. ఐదుగురు మృతి

image

నిర్మల్ జిల్లాలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. కాగా ఓ అనుమానాస్పద మృతి కేసు నమోదైంది. ఇందులో మూడు ఘటనలు బాసరలో జరగడం గమనార్హం. ఆర్జీయూకేటీ సమీపంలో కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు చనిపోగా.. అదే ప్రాంతంలో మరో మృతదేహం లభ్యమైంది. పుష్కరఘాట్ల వద్ద మరొకరు నీటమునిగి చనిపోయారు. సారంగాపూర్ మండలంలో జరిగిన యాక్సిడెంట్లో ఇద్దరు దుర్మరణం చెందారు.

News February 18, 2025

నేనొచ్చాక కూడా అధికారులు రారా..?: కలెక్టర్

image

ప్రజావాణిలో చాలా మంది అధికారులు తాను వచ్చిన తరువాత కూడా రావడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలుంటాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. సోమవారం ప్రజావాణిలో ఆయన పాల్గొన్నారు. కలెక్టర్ వచ్చిన కూడా అధికారులు రాకపోవడం సరైన విధానం కాదన్నారు. తర్వాత గ్రీవెన్స్ వచ్చిన అధికారులు వారికి సంబంధించిన అర్జీలపై కలెక్టర్‌కు వివరణ ఇచ్చారు. ఫిర్యాదు విభాగంలో 69 అర్జీలు స్వీకరించారు.

News February 18, 2025

నేరడిగొండ: ఒకేరోజు 700మంది రక్తదానం

image

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నేరడిగొండలోని తన నివాసం వద్ద నిర్వహించిన రక్తదాన శిబిరానికి భారీగా స్పందన వచ్చింది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వికలాంగులు, అభిమానులు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రక్తదానం చేస్తూ ప్రతి ఒక్కరు కేసిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రక్తదాన శిబిరంలో 700 మందికి పైగా రక్తదానం చేశారని పేర్కొన్నారు.

error: Content is protected !!