News April 14, 2025

చెరుకుపల్లి : పరీక్షలో ఫెయిల్.. విద్యార్థి సూసైడ్

image

ఇంటర్ ఫస్టియర్ ఫెయిలైనందుకు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన చెరుకుపల్లిలోని పొన్నపల్లిలో ఆదివారం జరిగింది. ప్రశాంత్ రెడ్డి (18) ఫెయిల్ అవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కుటుంబీకులు గమనించి చెరుకుపల్లి ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Similar News

News November 17, 2025

భీమవరం: దత్తత అవగాహన కార్యక్రమ గోడ పత్రిక ఆవిష్కరణ

image

జిల్లాలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి దత్తత తీసుకొని ప్రోత్సహించేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం భీమవరం కలెక్టరేట్లో దత్తత అవగాహన కార్యక్రమ గోడ పత్రికను ఆవిష్కరించారు. స్వచ్ఛంద సేవా సంస్థలు లేదా ఎక్కడైనా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉంటే గుర్తించి దత్తత ఇవ్వడానికి ప్రోత్సహించాలన్నారు. దత్తత ప్రక్రియను నిబంధనల మేరకు నిర్వహించాలన్నారు.

News November 17, 2025

భీమవరం: దత్తత అవగాహన కార్యక్రమ గోడ పత్రిక ఆవిష్కరణ

image

జిల్లాలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి దత్తత తీసుకొని ప్రోత్సహించేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం భీమవరం కలెక్టరేట్లో దత్తత అవగాహన కార్యక్రమ గోడ పత్రికను ఆవిష్కరించారు. స్వచ్ఛంద సేవా సంస్థలు లేదా ఎక్కడైనా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉంటే గుర్తించి దత్తత ఇవ్వడానికి ప్రోత్సహించాలన్నారు. దత్తత ప్రక్రియను నిబంధనల మేరకు నిర్వహించాలన్నారు.

News November 17, 2025

వరకట్న వేధింపులు, మరణాలు అడ్డుకోవాలి: కలెక్టర్

image

వరకట్నం వల్ల జరిగే గృహహింస, వేధింపులు, మరణాలను నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ అధ్యక్షతన తన ఛాంబర్‌లో వరకట్న నిషేధ చట్టం-1961 జిల్లా సలహా మండలి కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. వరకట్న నిషేధ చట్టం అమలుకు జిల్లా వరకట్న నిషేధ అధికారులు కీలక పాత్ర పోషించాలన్నారు.