News April 14, 2025
చెరుకుపల్లి : పరీక్షలో ఫెయిల్.. విద్యార్థి సూసైడ్

ఇంటర్ ఫస్టియర్ ఫెయిలైనందుకు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన చెరుకుపల్లిలోని పొన్నపల్లిలో ఆదివారం జరిగింది. ప్రశాంత్ రెడ్డి (18) ఫెయిల్ అవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కుటుంబీకులు గమనించి చెరుకుపల్లి ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Similar News
News November 20, 2025
భక్తులకు TTD ఛైర్మన్ విజ్ఞప్తి ఇదే..!

గుర్తు తెలియని సంస్థలకు విరాళాలు ఇచ్చి వారి ఉచ్చులో పడవద్దని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కోరారు. ‘గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, Savetemples.org ముసుగులో కొంతమంది వ్యక్తులు భక్తులను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. చట్టవిరుద్ధమైన విరాళాలను కోరుతూ మోసగిస్తున్నట్లు నాకు తెలిసింది. ఇటువంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలి’ అని ఛైర్మన్ విజ్ఞప్తి చేశారు.
News November 20, 2025
రెండో సారి తల్లి కాబోతున్న హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్, ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ రెండో సారి తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్లో తెలియజేశారు. బేబీ బంప్తో పింక్ కలర్ డ్రెస్లో ఫొటోలకు పోజులిచ్చారు. 2018లో వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ 2022లో కుమారుడికి జన్మనిచ్చారు. అతడికి ‘వాయు’ అని నామకరణం చేశారు. సీనియర్ నటుడు అనిల్ కపూర్ కూతురే సోనమ్.
News November 20, 2025
సిరిసిల్ల: RTC డ్రైవర్పై దాడి చేసిన వ్యక్తి కారుపై రూ.1400 చలానా

సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట(M) వల్లంపట్ల వద్ద<<18333594>> RTC డ్రైవర్ బాలరాజుపై దాడి <<>>చేసిన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరుకు చెందిన శ్రీకాంత్ కారుపై రూ.1,400 చలాన్లు పెండింగ్ ఉన్నాయి. శ్రీకాంత్ పేరిట రిజిస్ట్రేషన్ ఉన్న TS07HJ6969 నంబరు గల సుజుకీ బాలెనో కారుపై 2024 ఏప్రిల్ నుంచి రాష్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణల కారణంగా రూ.1,400 చలానా పెండింగ్లో ఉన్నట్టు HYD పోలీసులు X వేదికగా వెల్లడించారు.


