News April 14, 2025

చెరుకుపల్లి : పరీక్షలో ఫెయిల్.. విద్యార్థి సూసైడ్

image

ఇంటర్ ఫస్టియర్ ఫెయిలైనందుకు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన చెరుకుపల్లిలోని పొన్నపల్లిలో ఆదివారం జరిగింది. ప్రశాంత్ రెడ్డి (18) ఫెయిల్ అవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కుటుంబీకులు గమనించి చెరుకుపల్లి ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Similar News

News November 21, 2025

తూ.గో. జిల్లాలో రేపటి నుంచి గ్రామసభలు: పీడీ

image

తూ.గో. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఈ నెల 22న గ్రామ సభలు నిర్వహించాలని డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.నాగ మహేశ్వర రావు ఆదేశించారు. పారదర్శకతను పెంచడం, ప్రభుత్వ సేవలను గ్రామ స్థాయిలోనే ప్రజలకు అందుబాటులోకి తేవడమే ఈ సభల ముఖ్యోద్దేశమని తెలిపారు. ప్రజలు తప్పక హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.

News November 21, 2025

వరంగల్: కలెక్టర్‌కు ఎమ్మెల్సీ సారయ్య శుభాకాంక్షలు

image

దక్షిణ భారతదేశంలో జల సంరక్షణ కేటగిరి-2లో వరంగల్ జిల్లాకు మొదటి స్థానం దక్కిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం MLC బసవరాజు సారయ్య వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారదను అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో జల సంరక్షణ చర్యలను విజయవంతంగా చేపట్టి రాష్ట్రానికి ప్రతిష్ఠ తెచ్చారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ కార్పొరేటర్ గుండెటి నరేంద్ర కుమార్ తదితరులు ఉన్నారు.

News November 21, 2025

‘ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పేరు మార్చాలి’

image

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా, ఎన్టీఆర్ జిల్లాకు కృష్ణా జిల్లాగా పేరు మార్చాలని మంత్రుల కమిటీని కోరినట్లు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ జన్మించిన నిమ్మకూరు కృష్ణా జిల్లాలో ఉందని పేర్కొన్నారు. అలాగే గన్నవరం నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలోని కలపాలన్నారు. బాపులపాడు, ఉంగుటూరు మండలాల ప్రజలు మచిలీపట్నం వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.