News April 14, 2025

చెరుకుపల్లి : పరీక్షలో ఫెయిల్.. విద్యార్థి సూసైడ్

image

ఇంటర్ ఫస్టియర్ ఫెయిలైనందుకు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన చెరుకుపల్లిలోని పొన్నపల్లిలో ఆదివారం జరిగింది. ప్రశాంత్ రెడ్డి (18) ఫెయిల్ అవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కుటుంబీకులు గమనించి చెరుకుపల్లి ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Similar News

News October 24, 2025

VZM: పోలీసు అమరవీరుల సంస్మరణలో వ్యాస, వక్తృత్వ పోటీలు

image

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, విద్యార్థులకు, పోలీసు ఉద్యోగులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఎస్పీ దామోదర్‌ ఆదేశాల మేరకు ఈ పోటీలు అదనపు ఎస్పీ పి.సౌమ్యలత పర్యవేక్షణలో జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగాయి. ‘మహిళలు, పిల్లల రక్షణలో విద్యార్థుల పాత్ర’, ‘నేటి పోలీసింగ్‌లో టెక్నాలజీ పాత్ర’ వంటి అంశాలపై పోటీలు చేపట్టారు.

News October 24, 2025

కర్నూల్ ప్రమాదం.. ప్రకాశం ట్రావెల్స్ బస్సులు సేఫేనా?

image

కర్నూల్ వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు <<18087723>>ప్రవేట్ ట్రావెల్స్<<>> బస్సులను ఆశ్రయిస్తారు. ఘటనలు జరిగినప్పుడు ఈ ట్రావెల్స్ బస్సులు ఎంత వరకు సేఫ్ అన్నదానిపై చర్చ నడుస్తోంది. కర్నూల్ వద్ద ప్రమాదానికి గురైన బస్సుకు ఫిట్‌నెస్ గడువు తీరిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రకాశంలో ట్రావెల్స్ బస్సులు అంతా ఫిట్‌గా ఉన్నాయా.?

News October 24, 2025

ఓయూలో వాయిదా పడిన కోర్సుల పరీక్షా తేదీల ఖరారు

image

ఓయూ పరిధిలో ఈ నెల 18న బీసీ బంద్ నేపథ్యంలో వాయిదా పడిన వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎమ్మెస్సీ అప్లైడ్ న్యూట్రిషన్, ఎమ్మెస్సీ స్పోర్ట్స్ న్యూట్రిషన్ నాలుగో సెమిస్టర్ పరీక్షలను తిరిగి ఈ నెల 29వ తేదీన నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షా కేంద్రం, సమయంలలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.