News February 21, 2025

చెరుకుపల్లి: హోంగార్డుపై దాడి చేసిన వ్యక్తి అరెస్టు

image

చెరుకుపల్లిలో హోంగార్డు శ్రీనివాసరావుపై దాడి చేసిన కేసులో నిందితుడు వాగు దినేష్‌ను అరెస్టు చేసినట్లు ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. గురువారం రాత్రి మద్యం మత్తులో రోడ్డుపై గొడవ చేస్తున్న దినేష్‌ను హోంగార్డు శ్రీనివాసరావు అడ్డుకున్నారు. దీంతో అతను హోంగార్డుపై దాడికి పాల్పడ్డాడు. హోంగార్డు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, శుక్రవారం దినేష్‌ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్ఐ తెలిపారు.

Similar News

News October 14, 2025

ప్రధాని కర్నూలు పర్యటనను ఖరారు చేసిన పీఎంవో

image

AP: ఈ నెల 16న కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనపై PMO అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. 11.15amకు శ్రీశైలం ఆలయంలో పూజలు చేసి, 12:15pmకు శివాజీ స్ఫూర్తి కేంద్రం సందర్శిస్తారని పేర్కొంది. 2:30pmకు కర్నూలులో ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లకు శంకుస్థాపనతో సహా రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారని తెలిపింది. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారని వెల్లడించింది.

News October 14, 2025

‘స్కాలర్‌షిప్స్ రాలేదు.. జీతాలు ఇవ్వలేం’

image

TG: ఉన్నత విద్యాసంస్థలు తమ ఉద్యోగులకు జీతాలు నిలిపివేశాయి. దాదాపు 5 నెలల నుంచి వేతనాలు ఇవ్వట్లేదు. ప్రభుత్వం నుంచి స్కాలర్‌షిప్‌లు విడుదల కాలేదని, వచ్చిన తర్వాతే ఇస్తామని తేల్చి చెబుతున్నాయి. ఇప్పటికే 50% కాలేజీలు మూతపడేందుకు సిద్ధంగా ఉన్నాయని ఓ ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యం Way2Newsకు గోడు వెల్లబోసుకుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది అడ్మిషన్లూ కష్టమని ఆందోళన వ్యక్తం చేసింది.

News October 14, 2025

జూబ్లిహిల్స్ ఉపఎన్నిక.. మొత్తం 22 నామినేషన్లు

image

జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో నామినేషన్‌ల స్వీకరణ కొనసాగుతోంది. మొదటి రోజున 10 మంది అభ్యర్థులు 11 నామినేషన్‌లు దాఖలు చేయగా నేడు(2వ రోజు) 11 మంది అభ్యర్థులు 11 నామినేషన్‌లు సమర్పించారు. రెండు రోజుల్లో మొత్తంగా 22 నామినేషన్‌లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈనెల 13 నుంచి 21 వరకు కొనసాగనుంది.