News September 11, 2024
చెరువులు, కుంటలు ఆక్రమణ జరగకుండా చూడాలి: కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలో చెరువులు, కుంటలు ఆక్రమణ జరగకుండా చూడాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ హెచ్ఎండిఏ వెబ్ సైట్లో 8 మండలాలకు సంబంధించిన మ్యాపింగ్ ఉంచాలని చెప్పారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వవద్దని సూచించారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 15, 2025
తూప్రాన్: మహిళ ఆత్మహత్య

తూప్రాన్ పట్టణంలో మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పట్టణానికి చెందిన బుట్టి అమృత (52) మానసిక స్థితి సరిగా లేక ఈనెల 12న క్రిమిసంహారక మందు తాగింది. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
News November 15, 2025
మెదక్: గ్రామాల్లో బెంబేలెత్తిస్తున్న వీధికుక్కలు!

వీధి కుక్కల బెరద రోజు రోజుకు గ్రామాల్లో అధికమవుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చాలా మంది వీధి కుక్కల బారిన పడిన వారు ఉన్నారు. అయితే కుక్కల కాటు వల్ల రేబిస్ వ్యాధి వస్తుందని డాక్టర్లు కుక్కల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గ్రామాల్లో ఒక్కో కుక్క గుంపులో సుమారు 20 నుంచి 30 కుక్కల సంచారిస్తున్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్ట్ వీధి కుక్కలను నియంత్రించాలని ప్రభుత్వానికి ఆదేశించింది.
News November 15, 2025
RMPT: Way2News ఎఫెక్ట్.. కేసు నమోదు

మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేటలో అకారణంగా మద్యం మత్తులో బాలుడిపై దాడి చేసిన పినతండ్రి పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బాలరాజు తెలిపారు. <<18287012>>Way2Newsలో వచ్చిన కథనానికి<<>> స్పందించిన ఎస్ఐ బాలరాజు వివరాలు సేకరించారు. మద్యం మత్తులో పినతండ్రి నాలుగేళ్ల బాలుడిపై దాడి చేసినట్టు గుర్తించామని, సత్యనారాయణ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


