News February 13, 2025

చెరువుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

జిల్లాలో చెరువుల పునరుద్ధరణకు జలవనరుల శాఖ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. జిల్లాలో జలవనరుల శాఖ, జీవనోపాదులుపై అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో జలవనరుల లభ్యత అధికంగా ఉన్నాయన్నారు. వాటిని సరైన రీతిలో పరిరక్షించుకోవడం వలన జలవనరులు పెరిగి, అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.

Similar News

News November 19, 2025

ఒకేసారి 76 మంది CRPF జవాన్లను చంపిన హిడ్మా.. ఎలా అంటే?

image

హిడ్మా 2010లో చేసిన దాడిని భద్రతాబలగాలు ఎప్పటికీ మర్చిపోవు. 2010 ఏప్రిల్ 6న ఛత్తీస్‌గఢ్‌లో దంతెవాడ జిల్లా తాడిమెట్ల అటవీప్రాంతంలో CRPF జవాన్లపై మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. కూంబింగ్ ముగించుకుని వస్తుండగా మందుపాతరలు పేల్చారు. వెంటనే 1,000 మందికి పైగా మావోయిస్టులు వారిని చుట్టుముట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 76 మంది జవాన్లు మరణించారు. ఈ దాడికి నాయకత్వం వహించింది హిడ్మానే.

News November 19, 2025

తిరుపతిలో కలపడం మీకు ఇష్టమేనా..?

image

తిరుపతిని గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌గా మార్చడంలో భాగంగా 63 గ్రామ పంచాయతీలను కార్పొరేషన్‌లో విలీనం చేయాలని ప్రతిపాదించారు. తిరుపతి రూరల్లో 34 పంచాయతీలు ఉండగా ఇందులో 32 గ్రేటర్‌లో విలీనానికి విముఖత చూపాయి. సాయినగర్, న్యూ నగర్ పంచాయతీలు విలీనానికి జైకొట్టాయి. పన్నులు భారీగా పెరుగాయని కొందరు ప్రజలు సైతం గ్రేటర్‌లో కలవడానికి ఆసక్తిచూపడం లేదు. మరి మీరేమంటారు?

News November 19, 2025

SRCL: “CESS”లో విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్మెంట్ సోదాలు

image

కో- ఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై సొసైటీ LTD SRCL ఆఫీస్లో అవకతవకలు జరుగుతున్నాయన్న సమాచారంతో విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఆర్థిక లావాదేవీలు, సెస్ కార్యకలాపాలకు సంబంధించి రికార్డులు తనిఖీ చేసినట్లు తెలుస్తోంది. CESS కార్యాలయ సిబ్బంది నుంచి పలు రికార్డులు, FILES స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. దీనిపై సమగ్ర విచారణ చేసిన తర్వాత ఉన్నతాధికారులకు REPORT పంపనున్నారు.