News February 13, 2025

చెరువుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

జిల్లాలో చెరువుల పునరుద్ధరణకు జలవనరుల శాఖ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. జిల్లాలో జలవనరుల శాఖ, జీవనోపాదులుపై అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో జలవనరుల లభ్యత అధికంగా ఉన్నాయన్నారు. వాటిని సరైన రీతిలో పరిరక్షించుకోవడం వలన జలవనరులు పెరిగి, అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.

Similar News

News November 22, 2025

WGL: మార్చిలోపు ఆస్పత్రి పూర్తికి లక్ష్యం!

image

WGL సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని మార్చిలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత ప్రభుత్వం పెంచిన రూ.1,725.95 కోట్ల అంచనా వ్యయాన్ని ఆడిట్ తర్వాత రూ.1,558 కోట్లకు తగ్గించారు. సివిల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, పారిశుధ్య పనులకు రూ.1,158 కోట్లు కేటాయించగా, మొత్తం 85% పనులు పూర్తయ్యాయి. ఎక్విప్మెంట్ ఇన్‌స్టాలేషన్ జరుగుతోంది. నిధుల సమస్య లేకుండా మార్చిలో సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు?

News November 22, 2025

కృష్ణా: చోరీ అనుమానితుల ఫొటోలు విడుదల..!

image

మచిలీపట్నం మాచవరం సమీపంలోని పాత తౌడు ఫ్యాక్టరీ వద్ద రెండు రోజుల కిందట రెండు ఇళ్లలోకి చోరీకి పాల్పడిన నిందితుల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. వీరు ఎక్కడ కనిపించినా వెంటనే జిల్లా కంట్రోల్ రూమ్ 8332983789కు సమాచారం ఇవ్వాలని చిలకలపూడి సీఐ కోరారు. వీరిద్దరూ బైక్‌పై తిరుగుతుంటారని తెలిపారు.

News November 22, 2025

కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ ప్రారంభించాలి: DYFI

image

AP: కానిస్టేబుల్ ఫలితాలు విడుదలై నెలలు గడుస్తున్నా శిక్షణ ప్రారంభించకపోవడంపై DYFI మండిపడింది. దీనివల్ల అభ్యర్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపింది. 6,100 మందికి వెంటనే ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇవ్వాలని, లేదంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించింది. ఈ పోస్టులకు 2022లో నోటిఫికేషన్ వెలువడగా లీగల్ సమస్యలతో ప్రక్రియ ఆలస్యమైంది. ఈ ఏడాది జూన్‌లో మెయిన్స్ నిర్వహించి AUGలో రిజల్ట్స్ ప్రకటించారు.