News February 13, 2025
చెరువుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

జిల్లాలో చెరువుల పునరుద్ధరణకు జలవనరుల శాఖ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. జిల్లాలో జలవనరుల శాఖ, జీవనోపాదులుపై అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో జలవనరుల లభ్యత అధికంగా ఉన్నాయన్నారు. వాటిని సరైన రీతిలో పరిరక్షించుకోవడం వలన జలవనరులు పెరిగి, అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.
Similar News
News October 24, 2025
RGM: అలా చేస్తే.. ఆస్తి పన్నులో 10% డిస్కౌంట్..!

రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్, అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) J.అరుణశ్రీ గురువారం నిర్వహించిన సమావేశంలో ఇంటింటా ఇంకుడు గుంతలు నిర్మించేందుకు ప్రజల్లో చైతన్యం పెంచాలని ఆదేశించారు. జలశక్తి అభియాన్లో డిసెంబర్ 31 నాటికి 10వేల గుంతలు నిర్మించడం లక్ష్యమన్నారు. ఇంటి యజమానులు స్వయంగా గుంత నిర్మిస్తే ఆస్తి పన్నులో 10% రాయితీ లభిస్తుందన్నారు. నల్లా కనెక్షన్ వివరాలు అమృతం యాప్లో నమోదు చేయాలని సూచించారు.
News October 24, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 24, 2025
బిహార్ ఎన్నికల్లో యువతదే కీలకపాత్ర: మోదీ

బిహార్లో ఆర్జేడీ ఆటవిక పాలన(జంగల్ రాజ్)పై మరో వందేళ్లయినా చర్చ జరుగుతుందని PM మోదీ అన్నారు. ప్రతిపక్షాల దురాగతాలను ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు. ‘మేరా బూత్ సబ్సే మజ్ బూత్: యువ సంవాద్’ ఆడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. గతంలో RJD చేసిన ఆకృత్యాలను నేటి యువతకు BJP నేతలు వివరించాలని సూచించారు. NDA పాలనలో బిహార్ అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర అని పేర్కొన్నారు.