News April 2, 2025

‘చెరువుల సుందరీకరణ పనులు వేగవంతం చేయాలి’

image

తిరుపతి జిల్లా పరిధిలోని చెరువుల సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, జేసీ శుభం భన్సల్‌తో కలిసి ఆయన అధికారంతో సమావేశం నిర్వహించారు. చెరువులను సుందరీకరించే పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. చెరువులను ఆహ్లాదకరంగా మార్చాలని అధికారులకు ఆయన సూచించారు.

Similar News

News November 1, 2025

డోన్ వద్ద బోల్తా పడ్డ MPDO వాహనం

image

పింఛన్ల పంపిణీ విధులను ముగించుకుని డోన్ వైపు వస్తుండగా చింతలపేట సమీపంలో ఎంపీడీవో వెంకటేశ్వర్ రెడ్డి, ఏఈ నారాయణ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. శనివారం ఉదయం వాహనం నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎంపీడీవో, ఏఈ నారాయణ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.

News November 1, 2025

GWL: విద్యార్థులకు అస్వస్థత.. హాస్టల్ వార్డెన్ సస్పెండ్.!

image

గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం ధర్మవరం బీసీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ కారణంగా 54 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ తీవ్రంగా స్పందించారు. హాస్టల్ వార్డెన్‌ జయరాములును తక్షణమే <<18166938>>సస్పెండ్<<>> చేయాలని అధికారులను ఆదేశించారు. అస్వస్థత జరిగిన సమయంలో వార్డెన్ అందుబాటులో లేకపోవడం, విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

News November 1, 2025

MNCL: రేపు జిల్లాస్థాయి సాఫ్ట్ బాల్ ఎంపిక పోటీలు

image

మంచిర్యాల ZPHSబాలుర పాఠశాల మైదానంలో ఆదివారం జిల్లాస్థాయి సాఫ్ట్ బాల్ సీనియర్ పురుషులు, మహిళల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా సాఫ్ట్ బాల్ సంఘం సెక్రటరీ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ధ్రువపత్రాలతో రేపు ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు.