News February 21, 2025

‘చెరువువులను కృష్ణా జలాలతో నింపండి’

image

పుట్టపర్తి నియోజకవర్గంలో హంద్రీనీవా కాలువల ద్వారా కృష్ణా జలాలతో 193 చెరువులతో పాటు 2 రిజర్వాయర్లను నింపి భూగర్భ జలాలు పెంపొందించాలని మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి మంత్రి నిమ్మల రామానాయుడును కోరారు. గురువారం సచివాలయంలోని ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో మంత్రిని కలిసిన పల్లె రఘునాథ్ రెడ్డి పుట్టపర్తి నియోజకవర్గంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయని అన్నారు. నిర్మాణ పనులు చేపట్టాలని ఆయన కోరారు.

Similar News

News March 25, 2025

పల్నాడు: విడదల రజనిని అరెస్ట్ చేస్తారా..?

image

చిలకలూరిపేటకు చెందిన మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజని అరెస్టు కానున్నారా? అనే విషయంపై పొలిటికల్ సర్కిల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రూ.2 కోట్ల నగదు అక్రమంగా వసూలు చేసినట్లు ఇప్పటికే ఆమెపై కేసు నమోదు అయింది. ఎంపీ కృష్ణదేవరాయలు, ప్రత్తిపాటి పుల్లారావు, మర్రి రాజశేఖర్ వంటి కీలక నేతలు ఆమెపై వరుస పెట్టి ఆరోపణలు చేస్తుండటం ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

News March 25, 2025

తిరుపతి: సైలెంట్ మోడ్‌లో వైసీపీ నేతలు.?

image

తిరుపతి(D)లో YCP నేతల పరిస్థితి కొంచెం ఇష్టం-కొంచెంకష్టం అన్నట్లు మారింది. భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి, రోజా, మోహిత్ రెడ్డి మినహా మిగిలిన వారు పార్టీ కార్యకలాపాలకు అంటీముట్టనట్లు ఉన్నారని సమాచారం. బియ్యపు మధుసూదన్ రెడ్డి, చెవిరెడ్డి, సత్యవేడు ఇన్‌ఛార్జ్ రాజేశ్ వంటి నేతలు నియోజకవర్గంలో పెద్దగా కనబడటం లేదని టాక్. చెవిరెడ్డి సైతం మునుపటి స్థాయిలో చురుగ్గా లేరని చర్చ జరుగుతోంది.

News March 25, 2025

రూ.లక్షలు ఖర్చు పెట్టి నన్ను ట్రోల్ చేయిస్తున్నారు: పూజా హెగ్డే

image

కొంతమంది రూ.లక్షలు ఖర్చుపెట్టి మరీ తనను ట్రోల్ చేయిస్తున్నారని హీరోయిన్ పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో వాపోయారు. ‘నాపై ట్రోలింగ్ చేస్తున్న మీమ్ పేజీలను కాంటాక్ట్ చేయమని మా టీమ్‌కు చెప్పాను. ఈ పని చేసేందుకు తమకు రూ. లక్షలు ఇస్తున్నారని మా టీమ్‌తో మీమర్స్ చెప్పారు. ట్రోలింగ్ ఆపాలంటే నేను కూడా అంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు’ అని పేర్కొన్నారు. తెలుగులో ఆమె చివరిగా ఎఫ్-3లో స్పెషల్ సాంగ్‌లో కనిపించారు.

error: Content is protected !!