News February 5, 2025
చెర్వుగట్టులో కట్నాల రాబడి రూ.8.89 లక్షలు

చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం తెల్లవారుజామున శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణంలో భక్తులు సమర్పించిన కట్నాలు సాయంత్రం 4 గంటల వరకు లెక్కించగా రూ.8,89,445లు వచ్చినట్లు కార్యనిర్వహణ అధికారి నవీన్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ కృష్ణ, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ భాస్కర్ పాల్గొన్నారు.
Similar News
News October 30, 2025
NLG: పంట నష్టం.. క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన!

మొంథా తుపాన్ కారణంగా ఉమ్మడి జిల్లాలో నష్టపోయిన పంటల వివరాలను సేకరించేందుకు వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతున్నారు. గ్రామాల్లో ఉన్న ఏఈఓల ద్వారా ఉన్నతాధికారులు వివరాలను సేకరిస్తున్నారు. ఏయే గ్రామాల్లో వంట ఎన్ని ఎకరాల్లో వరి పంట నేలకొరిగిందనే విషయాలను తెలుసుకుంటున్నారు. రైతుల వివరాలను, ఎన్ని ఎకరాల్లో నష్టపోయిందో రికార్డుల్లో నమోదు చేసుకుంటున్నారు.
News October 30, 2025
NLG: మోంథా ఎఫెక్ట్… రైళ్ల రద్దు

మోంథా తుపాన్ ప్రభావం రైళ్ల రాకపోకలపై పడింది. సికింద్రాబాద్ నుంచి NLG మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జన్మభూమి, విశాఖ, ఫలక్ నుమా రైళ్లు బుధవారం కొంత ఆలస్యంగా నడిచాయి. ఇవాళ ఉదయం రావాల్సిన పల్నాడు ఎక్స్ప్రెస్ రద్దయినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
News October 30, 2025
NLG: నిత్య పూజలకు నోచుకోని శివయ్య

శాలిగౌరారంలోని శివాలయంలో నిత్యపూజలు జరగకపోవడం పట్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారని ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్ గుండా దుర్గయ్య నల్గొండలోని ఎండోమెంట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఆలయ పూజారి రాంబాబు నిత్య పూజలు చేయడానికి రావడం లేదని ఫిర్యాదు చేశారు. నెల రోజుల క్రితం ఎండోమెంట్ ఈవో రుద్రారం వెంకటేశ్వర్లుకు నిత్య పూజ చేస్తానని పెద్దమనుషుల సమక్షంలో రాసిచ్చినప్పటికీ, ఆ తర్వాత కూడా పూజారి రావడం లేదన్నారు.


