News May 3, 2024

చెవిరెడ్డి దోపిడీ రూ.2 వేల కోట్లు: లోకేశ్

image

ఒంగోలు YCP MP అభ్యర్థి MLA చెవిరెడ్డిపై నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరిగిన సభలో లోకేశ్ మాట్లాడారు. ‘చంద్రగిరిని ఐదేళ్లు దోచుకుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రూ.2 వేల కోట్లు సంపాదించారు. ఆయన సినిమా అయిపోవడంతో ప్రకాశం జిల్లాకు పారిపోయారు. శ్రీవారి దర్శన టికెట్లు, గంజాయి, ఎర్రచందనంతో బాగా సంపాదించారు. అందుకే ఆయనకు చెవిలో పువ్వు అని పేరు పెట్టా’ అని లోకేశ్ అన్నారు.

Similar News

News November 20, 2025

ప్రకాశం: నూతన అక్రిడిటేషన్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయులకు రెండేళ్ల కాలపరిమితికి జారీ చేసే నూతన అక్రిడిటేషన్‌లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు గురువారం ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తులను http://mediarelations.ap.gov.in వెబ్ సైట్‌లో సమర్పించాలన్నారు. అర్హత కలిగిన పాత్రికేయులు పూర్తి వివరాలను వెబ్సైట్లో ఈ నెల 21 నుంచి నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.

News November 20, 2025

ప్రకాశం: నూతన అక్రిడిటేషన్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయులకు రెండేళ్ల కాలపరిమితికి జారీ చేసే నూతన అక్రిడిటేషన్‌లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు గురువారం ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తులను http://mediarelations.ap.gov.in వెబ్ సైట్‌లో సమర్పించాలన్నారు. అర్హత కలిగిన పాత్రికేయులు పూర్తి వివరాలను వెబ్సైట్లో ఈ నెల 21 నుంచి నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.

News November 20, 2025

సాగర్ కవచ్‌కు 112 మంది పోలీసుల కేటాయింపు

image

జిల్లాలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు సాగర్ కవచ్‌ను రెండు రోజులపాటు పోలీసులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా సముద్ర తీర ప్రాంతంలో మొత్తం 112 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని బందోబస్తు విధులలో కేటాయించారు. సముద్ర మార్గం ద్వారా చొరబాట్లను అడ్డుకోవడం, అనుమానాస్పద వస్తువులను గుర్తించడం వంటి అంశాలపై ప్రత్యేక పోలీస్ బృందాలను సైతం నియమించారు.