News March 23, 2025

చేతబడులు, మూఢనమ్మకాలు నమ్మవద్దు : ఎస్పీ అమిత్ 

image

మూఢనమ్మకాలు నమ్మవద్దని గన్నెల పీహెచ్సీ వైద్యులు డా కమలకుమారి, డా. కనికినాయుడు పేర్కొన్నారు. అరకులోయ మండలం లోతేరు పంచాయతీ డుంబ్రిగుడలో చేతబడి నెపంతో వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ మేరకు SP అమిత్ బర్ధర్ ఆదేశాలతో గన్నెల పీహెచ్‌సీ వైద్యులు శనివారం ఆ గ్రామానికి వెళ్లి చేతబడులపై అవగాహన చేశారు. ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించాలన్నారు. CI హిమగిరి, MPDO లవరాజు, MRO ప్రసాద్ ఉన్నారు.

Similar News

News February 24, 2026

BIG BREAKING.. రేపు NGKLకు కేటీఆర్ రాక!

image

నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర జాతర దాడిలో మరణించిన రెండు నెలల పసిపాప కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బుధవారం రానున్నారు. ఉదయం 10:30 గంటలకు ఆయన బాధితులను కలిసి ధైర్యం చెప్పనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు.

News February 24, 2026

కామారెడ్డి: 37 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు: ఎస్పీ

image

కామారెడ్డి జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ వార్షిక పరీక్షల కోసం పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SP రాజేశ్ చంద్ర తెలిపారు. పరీక్షల నిర్వహణ దృష్ట్యా జిల్లాలోని 37 పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 163 BNSS అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది ఉండకూడదని ఆదేశించారు.

News February 24, 2026

సారవకోట: జిల్లా గ్రంథాలయ సంస్థలో ఖాళీగా 70 ఉద్యోగాలు

image

జిల్లా గ్రంథాలయ సంస్థలో 70 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేయాల్సి ఉందని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శంకరరావు తెలిపారు. సారవకోట మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా గ్రంథాలయ సంస్థకు జిల్లా పట్టణ, గ్రామీణ పంచాయతీల నుంచి రావలసిన 8% గ్రంథాలయ సెస్సు‌లను ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు.