News February 17, 2025
చేనేతల ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలి: కలెక్టర్

చేనేత కుటుంబాలు ఆర్థికంగా ఎదగడానికి అధికారులు కృషి చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అన్నారు. చేనేత కుటుంబాల జీవన స్థితిగతులను మెరుగుపరచటానికి తీసుకోవాల్సిన చర్యల పై సంబంధిత అధికారులతో సోమవారం కలెక్టర్ ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ముద్ర పథకం కింద చేనేత కుటుంబాలకు చేయూత అందించేందుకు రుణాలు అందించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు.
Similar News
News March 22, 2025
రాష్ట్రంలో కొత్తగా 70 బార్ల ఏర్పాటు!

TG: ఆదాయం పెంచుకునేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తులు చేస్తోంది. కొత్తగా 70 బార్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అందుకు అనుగుణంగా ఇన్కమ్ ఎక్కువగా వచ్చే ప్రాంతాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో 1,171 బార్లు ఉండగా వీటిలో సగానికి పైగా హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్నాయి. మైక్రోబూవరీల సంఖ్యను పెంచే అవకాశమున్నట్లు సమాచారం.
News March 22, 2025
కరీంనగర్: వరుసగా మృతదేహాలు లభ్యం

ఉమ్మడిKNR జిల్లావ్యాప్తంగా వరుసగా మృతదేహాలు లభ్యమవుతున్నాయి. గురువారం KNR జిల్లా చిగురుమామిడి(M) ఇందుర్తికి చెందిన అందే మల్లవ్వ అనే వృద్ధురాలి మృతదేహం తిమ్మాపూర్ ఎల్ఎండీ జలాశయం వద్ద లభ్యంకాగా, KNRలోని NTR విగ్రహం సమీపంలోని నాలాలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. వేములవాడ(M)అగ్రహారంలో గుర్తుతెలియని మగ మృతదేహం కనిపించింది. నిన్న HZB(M)తుమ్మనపల్లి SRSPకెనాల్లో అరవింద్ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది.
News March 22, 2025
కరీంనగర్: వరుసగా మృతదేహాలు లభ్యం

ఉమ్మడిKNR జిల్లావ్యాప్తంగా వరుసగా మృతదేహాలు లభ్యమవుతున్నాయి. గురువారం KNR జిల్లా చిగురుమామిడి(M) ఇందుర్తికి చెందిన అందే మల్లవ్వ అనే వృద్ధురాలి మృతదేహం తిమ్మాపూర్ LMD జలాశయం వద్ద లభ్యంకాగా, KNRలోని NTR విగ్రహం సమీపంలోని నాలాలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. వేములవాడ(M)అగ్రహారంలో గుర్తుతెలియని <<15824324>>మగ<<>> మృతదేహం కనిపించింది. నిన్న HZB(M)తుమ్మనపల్లి SRSPకెనాల్లో అరవింద్ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది.