News February 23, 2025

చేన్నేకొత్తపల్లి: పాము కాటుకు గురై చిన్నారి మృతి

image

చేన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురానికి చెందిన ప్రీతి అనే మూడో తరగతి విద్యార్థిని శనివారం రాత్రి పాముకాటుకు గురై మృతి చెందారు. శనివారం రాత్రి ప్రీతి ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా.. నాగుపాము కాటు వేయడంతో ఆమెను తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం పుట్టపర్తి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు విద్యార్థిని తల్లితండ్రులు తెలిపారు.

Similar News

News November 22, 2025

గుర్తులేదు.. మరిచిపోయా: ఐబొమ్మ రవి

image

TG: మూడో రోజు పోలీసుల విచారణలో ఐబొమ్మ రవి సమాధానాలు దాట వేసినట్లు తెలుస్తోంది. అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పాడట. బ్యాంకు ఖాతాల వివరాలపైనా నోరు విప్పలేదని సమాచారం. యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లు అడిగితే గుర్తులేదని, మరిచిపోయానని తెలిపినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఎథికల్‌ హ్యాకర్ల సాయంతో హార్డ్‌‌డిస్క్‌లు, పెన్‌‌డ్రైవ్‌లు ఓపెన్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

News November 22, 2025

మంచిర్యాల: పసిబిడ్డల ప్రాణాలకు లెక్కలేదా?

image

ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొందరు డాక్టర్లు <<18353100>>బిడ్డల<<>> ప్రాణాలతో చలగాటమాడుతున్నారు. నిర్లక్ష్యంతో వారి ప్రాణాలు తీసి డబ్బులతో పరిహారం చేసుకుంటున్నారు. శుక్రవారం డాక్టర్ల నిర్లక్ష్యానికి 5 ప్రాణాలు పోయాయి. అయినా వారిలో సీరియస్‌నెస్ లేదు. ఇన్ని ప్రాణాలు పోతున్నా అధికారులు పట్టనట్లు వ్యవరిస్తున్నారని.. బిడ్డల ప్రాణాలు తీసి డబ్బులు బిచ్చంగా పడేసి తప్పించుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపై మీ కామెంట్

News November 22, 2025

ఇతిహాసాలు క్విజ్ – 74 సమాధానాలు

image

ప్రశ్న: విష్ణుమూర్తి ద్వార పలుకులు అయిన జయవిజయులు అసురులుగా ఎందుకు జన్మించారు?
సమాధానం: ఓసారి సనక సనందనాది మహర్షులు విష్ణు దర్శనానికి రాగా, వీరు వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో కోపించిన మహర్షులు వారిని భూలోకంలో రాక్షసులుగా జన్మించమని శపించారు. వీరు 3 జన్మలలో (హిరణ్యాక్ష-హిరణ్యకశిప, రావణ-కుంభకర్ణ, శిశుపాల-దంతవక్ర) అసురులుగా పుట్టి, స్వామి చేతిలోనే మరణించి తిరిగి వైకుంఠం చేరారు.<<-se>>#Ithihasaluquiz<<>>