News February 23, 2025

చేన్నేకొత్తపల్లి: పాము కాటుకు గురై చిన్నారి మృతి

image

చేన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురానికి చెందిన ప్రీతి అనే మూడో తరగతి విద్యార్థిని శనివారం రాత్రి పాముకాటుకు గురై మృతి చెందారు. శనివారం రాత్రి ప్రీతి ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా.. నాగుపాము కాటు వేయడంతో ఆమెను తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం పుట్టపర్తి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు విద్యార్థిని తల్లితండ్రులు తెలిపారు.

Similar News

News October 18, 2025

పిశాచ స్థానం పట్ల నిర్లక్ష్యం వద్దు: వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు

image

పిశాచ స్థానాన్ని నిర్లక్ష్యం చేయకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ విషయం పట్ల అలసత్వం వహిస్తే ఇంట్లో ఉండేవారు ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. ‘ఇంటి చుట్టూరా ప్రహరీకి నడుమ ఉండే ఖాళీ స్థలాన్ని పిశాచ స్థానంగా చెబుతారు. ఇది ఉంటేనే గాలి, వెలుతురు ఇంట్లోకి వస్తాయి. ఇవి ఆ గృహంలో నివసించే వారికి ఉత్తేజాన్ని కలిగిస్తాయి’ అని తెలిపారు.<<-se>>#Vasthu<<>>

News October 18, 2025

వచ్చేనెల 5న జాబ్ మేళా: తేజ భరత్

image

జిల్లాలోని ప్రతి మునిసిపాలిటీలో తృప్తి క్యాంటీన్, అరకు కాఫీ ప్రాంచైజీ వంటివి మెప్మా మహిళల ద్వారా ఏర్పాటు చేయాలని మెప్మా మిషన్ డైరెక్టర్ తేజ భరత్ శనివారం అన్నారు. వచ్చేనెల 5న నిపుణ-మెప్మా ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా పరిధిలోని నిరుద్యోగులకు జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. ఆసక్తి ఉన్న వారు ప్రతి మునిసిపాలిటీ పరిధిలోని మెప్మా విభాగంలో నమోదు చేసుకోవాలన్నారు. 10 ఆపై చదివిన వారు అర్హులన్నారు.

News October 18, 2025

టారిఫ్స్‌పై గుడ్‌న్యూస్?.. చర్చలు జరుగుతున్నాయన్న గోయల్

image

భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ చర్చలు స్నేహపూర్వక వాతావరణంలో జరుగుతున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. యూఎస్ టారిఫ్స్‌పై గుడ్‌న్యూస్ వస్తుందా అని మీడియా ప్రశ్నించగా ‘ట్రేడ్ చర్చలు, ఒప్పందాలు డెడ్‌లైన్స్ ఆధారంగా జరగవు. రైతులు, జాలర్లు, MSME రంగ ప్రయోజనాలు కాపాడేవరకు ఎలాంటి అగ్రిమెంట్ పూర్తికాదు. చర్చలు బాగా సాగుతున్నాయి. మేము ఓ నిర్ణయానికి వచ్చాక తెలియజేస్తాం’ అని తెలిపారు.