News February 21, 2025
చేబ్రోలు మహిళకి జీబీఎస్ పాజిటివ్

ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన ఓ మహిళకు జీబీఎస్ లక్షణాలు కనిపించడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకి జీబీఎస్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు శుక్రవారం పేర్కొన్నారు. చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కలిదిండి సుబ్బరాజు వర్మ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి ఫీవర్ సర్వే చేపట్టారు.
Similar News
News October 22, 2025
విష్ణు వామనావతారం ఎందుకు ఎత్తాడు?

దానశీలి బలి చక్రవర్తి అపారమైన యాగబలంతో ఇంద్ర పదవిని ఆక్రమించి 3 లోకాలపై ఆధిపత్యాన్ని సాధించాడు. ఇది లోకాల సమతుల్యతను దెబ్బతీయడంతో పాటు దేవతల్లో ఆందోళన పెంచింది. అందుకే విష్ణువు, బలి దానగుణాన్ని గౌరవిస్తూనే, అతని అహంకారాన్ని అణచడానికి, లోకాలను రక్షించడానికి వామనుడి రూపంలో వచ్చాడు. కేవలం మూడడుగుల నేల అడిగి, బలిని పాతాళానికి పంపాడు. సద్గుణాలకు మెచ్చి ఆ లోకానికి రాజుగా చేసి, ధర్మాన్ని నిలబెట్టాడు.
News October 22, 2025
ములుగు: చెల్లిని ఆస్పత్రికి తీసుకెళ్తూ.. అక్క మృతి

ములుగు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో <<18068173>>ఇంటర్ విద్యార్థిని<<>> సింధూజ మృతిచెందిన విషయం తెలిసిందే. కన్నాయిగూడెం మం. చిట్యాల వాసి సింధూజ(17) చెల్లి శ్రీపూజకు తీవ్ర జ్వరం రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లడానికి గ్రామానికి చెందిన యువకుడు కృష్ణారావు సాయం కోరింది. ముగ్గురు కలిసి ఆస్పత్రికి బైక్పై వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే సింధూజ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
News October 22, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. హోటళ్లకు భారీ డిమాండ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు కేవలం 17 రోజుల ప్రచార సమయం మిగిలి ఉండటంతో రాజకీయ వేడి పెరిగింది. అభ్యర్థులు తమ ప్రచారాన్ని వేగవంతం చేస్తూ అన్ని ప్రాంతాలను కవర్ చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారు. దీంతో ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు వసతి కల్పించేందుకు జూబ్లీహిల్స్తో పాటు చుట్టుపక్కల హోటళ్లు కిటకిటలాడుతున్నాయి. ఉప ఎన్నికల కారణంగా ఈ ప్రాంతంలో హోటల్ గదులకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది.