News December 3, 2024
చేవెళ్ల యాక్సిడెంట్ ఎఫెక్ట్.. అధికారుల హెచ్చరిక

చేవెళ్ల మం. పరిధి ఆలూరు గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళవారం చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ హెచ్చరిక బ్యానర్ ఏర్పాటు చేసింది. హైవే పక్కన కూరగాయలు అమ్మితే రూ. 10 వేల FINE విధిస్తామన్నారు. చేవెళ్ల వ్యవసాయ మార్కెట్, రైతు బజార్లో కూరగాయలు అమ్ముకోవాలని సూచించారు. ఇందుకు తగు సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
Similar News
News November 3, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. రేవంత్ రెడ్డి ‘7 రోజుల ప్రచార వ్యూహం’

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కేవలం 9 రోజులు మాత్రమే మిగిలి ఉండగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షం BRSను లక్ష్యంగా చేసుకుని ‘7 రోజుల ప్రచార వ్యూహం’ను అనుసరించేందుకు సిద్ధమయ్యారు. ఈవ్యూహంలో KCR అవినీతి పాలన చేశారనే విషయాన్ని రేవంత్ రెడ్డి హైలైట్ చేయనున్నారు. BRSనేతల ఇంటింటి ప్రచారానికి దీటుగా కాంగ్రెస్ పాలనలో అభివృద్ధిపై ప్రచారం చేయాలని మంత్రులను కోరారు. GHMC మేయర్ విజయలక్ష్మి పర్యవేక్షించనున్నారు.
News November 3, 2025
BREAKING: HYD: బాలానగర్లో MURDER

HYD బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు దారుణ హత్య జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఐడీపీఎల్ బస్టాప్ సమీపంలో గఫర్(39) అనే వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడి రక్తస్రావం కారణంగా గఫర్ ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. సమాచారం అందుకున్న బాలానగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
News November 3, 2025
జూబ్లీహిల్స్లో గెలుపు మాదే: కిషన్ రెడ్డి

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ ప్రచారం ఊపందుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అభ్యర్థి దీపక్ రెడ్డితో కలిసి బైక్ ర్యాలీ, క్యాంపెయిన్ నిర్వహించారు. నాగార్జున కమ్యూనిటీ హాల్ నుంచి ర్యాలీ ప్రారంభమైంది. జూబ్లీహిల్స్లో బీజేపీ గెలుపు పక్కా అని, BRS, కాంగ్రెస్ పాలనల్లో వెనుకబాటును సరిదిద్దేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఉపఎన్నికలో దీపక్ రెడ్డి విజయం కీలకమని పేర్కొన్నారు.


