News September 23, 2024
చేవెళ్ల: రూ.38 కోట్లు విడుదల: ఎంపీ

స్వదేశీ అభియాన్ పథకం కింద రూ.99 కోట్లతో వికారాబాద్ అనంతగిరి కొండలను అభివృద్ది చేస్తామని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. దీనిలో మొదటి దశలో రూ.38 కోట్లు విడుదలయ్యాయని పేర్కొన్నారు. శంకర్పల్లి, మర్పల్లి రోడ్లు దెబ్బతిన్నాయని, రూ.400 కోట్లు నిధులు మంజూరు చేయాలని మంత్రి నితిన్ గడ్కరీని అడుగుతానని తెలియజేశారు.
Similar News
News December 1, 2025
HYD: ‘ఓన్లీ ప్రాఫిట్ నో లాస్’ పేరుతో రూ.1.87కోట్ల మోసం

స్టాక్ సలహాల పేరుతో నగరానికి చెందిన కృత్రిమ ఆభరణాల వ్యాపారిని మోసగించిన ఇండోర్కు చెందిన ముఖేశ్ పాఠక్పై సీసీఎస్ కేసు నమోదు చేసింది. ‘ఓన్లీ ప్రాఫిట్ నో లాస్’ అని నమ్మబలికి 2021 నుంచి 2024 వరకు దశలవారీగా రూ.1.87కోట్లు తీసుకున్న నిందితుడు. చివరికి ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ కావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సీసీఎస్ తెలిపింది.
News December 1, 2025
HYD: మెగా జలమండలి.. DPRపై ఫుల్ ఫోకస్

గ్రేటర్ HYD సహా వివిధ ప్రాంతాలకు విస్తరించి ఉన్న జలమండలి ఇప్పుడు మరింత విస్తరణకు శ్రీకారం చుట్టింది. DPR సిద్ధం చేయడంలో నిమగ్నమైనట్లు అధికారులు తెలిపారు.1450.3 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న జలమండలి మరో 603 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని మెగా జలమండలిగా తాగునీరు, డ్రైనేజీ నెట్వర్క్ సిద్ధమవుతోంది.
News December 1, 2025
HYD: ఇక పర్యాటక రంగానికి ఏఐ సేవలు

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. దీంట్లో భాగంగా ఏఐ సహాయంతో టూరిస్టులను ఆకర్షించే ప్రయత్నాలు మొదలయ్యాయి. టూరిస్టులు చూసే ప్రదేశాలు సమయం చెప్తే దానికి తగ్గట్టుగా వారి ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది. దక్కన్ ఎక్స్ప్లోరర్ తన కార్డుతో ఈ సేవలను అందించడానికి రూపకల్పన చేస్తున్నారు. అలాగే నగరంలోని వివిధ ప్రాంతాల్లో నైట్ టూరిజంను పెంచేందుకు చూస్తోంది.


