News April 28, 2024

చేవెళ్ల లోక్‌సభ స్థానంలో డబుల్ పేర్లతో గుబులు!

image

డబుల్‌ పేర్లు ప్రధాన పార్టీ అభ్యర్థులకు గుబులు రేపుతున్నాయి. చేవెళ్ల మండలం ధర్మసాగర్‌కు చెందిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. AIFB నుంచి కర్మన్‌ఘాట్‌కు చెందిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా గడ్డం రంజిత్ రెడ్డి నామినేషన్‌ వేయగా.. ఇదే పేరుతో దుండిగల్‌కు చెందిన రంజిత్‌రెడ్డి గాదె రెవెల్యూషనరీ సోషలిస్టు పార్టీ నుంచి నామినేషన్ వేశారు.

Similar News

News April 15, 2026

HYD: ఇంటర్ మెమోల్లో తప్పులా? సరిచేసుకోండిలా!

image

తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఇంటర్ బోర్డు విద్యార్థులకు సూచనలు చేసింది. మెమోల్లో విద్యార్థుల పేర్లు, పుట్టిన తేదీ, మార్కుల వంటి వాటిలో తప్పులు దొర్లితే వెంటనే సరిచేసుకోవాలని సూచించింది. ఈ సవరణల కోసం విద్యార్థులకు 10రోజుల గడువు ఇచ్చింది. కళాశాల ప్రిన్సిపల్‌ను సంప్రదించి అవసరమైన పత్రాలను ఇచ్చి సవరణలు చేసుకోవచ్చని, లేదా నేరుగా <<8096958096>>హెల్ప్ డెస్క్‌ను<<>> వాట్సాప్‌లో సంప్రదించాలని తెలిపింది.
SHARE IT

News April 15, 2026

HYD: అడిక్‌మెట్ మెట్టుబావికి పునర్జీవం

image

అడిక్‌మెట్‌లోని చారిత్రక మెట్టుబావికి పూర్వవైభవం లభించింది. దశాబ్దాలుగా చెత్తకుప్పగా మారిన ఈ బావిని అద్భుతంగా పునరుద్ధరించారు. టన్నుల కొద్దీ వ్యర్థాలను తొలగించడంతో ప్రస్తుతం స్వచ్ఛమైన నీటి ఊటలు ఉబికి వస్తున్నాయి. బన్సీలాల్‌పేట బావి తరహాలోనే దీనిని కూడా అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. భూగర్భ జలాల పెంపునకు, వారసత్వ కట్టడాల పరిరక్షణకు ఈ ప్రాజెక్ట్ ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది.

News April 15, 2026

HYD: అడిక్‌మెట్ మెట్టుబావికి పునర్జీవం

image

అడిక్‌మెట్‌లోని చారిత్రక మెట్టుబావికి పూర్వవైభవం లభించింది. దశాబ్దాలుగా చెత్తకుప్పగా మారిన ఈ బావిని అద్భుతంగా పునరుద్ధరించారు. టన్నుల కొద్దీ వ్యర్థాలను తొలగించడంతో ప్రస్తుతం స్వచ్ఛమైన నీటి ఊటలు ఉబికి వస్తున్నాయి. బన్సీలాల్‌పేట బావి తరహాలోనే దీనిని కూడా అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. భూగర్భ జలాల పెంపునకు, వారసత్వ కట్టడాల పరిరక్షణకు ఈ ప్రాజెక్ట్ ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది.