News February 3, 2025

చైల్డ్ ఆధార్‌పై ప్రత్యేక దృష్టి సారించండి: కలెక్టర్

image

0-5 సంవత్సరాల వయస్సు కలిగిన చిన్నారుల చైల్డ్ ఆధార్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి ఆధార్ పర్యవేక్షణ కమిటీ సమావేశం కమిటీ చైర్మన్, కలెక్టర్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 38 వేల వరకు పెండింగ్ ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయని అన్నారు.

Similar News

News April 19, 2026

కృష్ణా: రేపు కలెక్టరేట్‌లో ఎంప్లాయిస్ గ్రీవెన్స్

image

జిల్లాలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గాను ఈ నెల 20వ తేదీన కలెక్టరేట్‌లో ఎంప్లాయిస్ గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ మీటింగ్ హాలులో ప్రారంభమయ్యే గ్రీవెన్స్‌లో ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

News April 19, 2026

మచిలీపట్నంలో నేడు బంగారం ధర ఎంతంటే!

image

అక్షయ తృతీయ కావడంతో జిల్లా కేంద్రంమైన మచిలీపట్నంలోని బంగారు దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. మచిలీపట్నంలో ఆదివారం గ్రాము బంగారం రూ. 15,078 పలుకుతోంది. 10 గ్రాములు రూ. 1,50,780 చొప్పున విక్రయిస్తున్నారు. వెండి గ్రాము రూ.280గా ఉంది. అక్షయ తృతీయలో కనీసం గ్రాము బంగారమైనా కొనాలని పలువురు ఆసక్తి చూపుతున్నారు.

News April 19, 2026

పెడన: పేకాడుతూ అరెస్ట్ అయిన మహిళలకు బెయిల్!

image

పెడనలో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు జరిపిన మెరుపు దాడిలో నలుగురు మహిళలతో సహా మొత్తం ఆరుగురు పట్టుబడ్డారు. ఈ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. నిందితులను శనివారం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ కేసులో పట్టుబడిన మహిళల్లో ఇద్దరిపై గతంలోనే తొమ్మిది కేసులు ఉన్నట్లు తేలడం విస్మయానికి గురిచేస్తోంది.