News February 7, 2025
చొప్పదండి: నవోదయ పరిమిత సీట్ల ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

చొప్పదండి నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతులలో పరిమిత సీట్లకు శనివారం జరిగే ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9వ తరగతిలో ప్రవేశానికి 1340 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 11వ తరగతిలో ప్రవేశానికి 1278 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రిన్సిపల్ మంగతాయారు తెలిపారు. అభ్యర్థులు 10 గంటల లోపు హాల్ టికెట్, ఆధార్ కార్డుతో హాజరు కావాలని ప్రిన్సిపల్ సూచించారు.
Similar News
News October 31, 2025
వరంగల్: ఎస్ఏ పరీక్షలు వాయిదా!

వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఎస్ఏ పరీక్షలను వాయిదా వేసినట్లు డీఈవోలు రంగయ్య, వాసంతి తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రతికూల పరిస్థితుల కారణంగా గురు, శుక్ర, శని వారాల్లో నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేశామని ఎప్పుడు నిర్వహించేది శనివారం వెల్లడిస్తామని రంగయ్య తెలిపారు. వర్షాల కారణంగా వాయిదా వేసిన పరీక్షలను సోమ, మంగళ, బుధవారాల్లో నిర్వహిస్తామని HNK DEO వాసంతి తెలిపారు.
News October 31, 2025
ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచాలి: కలెక్టర్ సిరి

కర్నూలు జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి గురువారం అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో 91 శాఖల అధికారులతో మూడు రోజుల పాటు జరిగిన ఇంటరాక్టివ్ సెషన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. స్టాండ్ అప్ ఇండియా పథకంపై అవగాహన పెంచాలని, నాబార్డ్ ద్వారా ఆర్ఐడీఎఫ్ నిధులు వినియోగించుకోవాలని సూచించారు.
News October 31, 2025
మ్యాట్రి’మనీ’ మోసాలపై కర్నూలు ఎస్పీ హెచ్చరిక

వివాహ సంబంధిత వెబ్సైట్లు, యాప్లు, సోషల్ మీడియా వేదికల ద్వారా జరుగుతున్న మ్యాట్రిమోనియల్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గురువారం హెచ్చరించారు. నకిలీ పేర్లు, ఆకర్షణీయమైన ఫొటోలతో కూడిన ప్రొఫైల్స్ నమ్మి అమాయకులు మోసపోతున్న ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయన్నారు. మోసపోయిన వారు ఆన్లైన్ ఫిర్యాదుల కోసం www.cybercrime.gov.inలో సంప్రదించాలని ఎస్పీ సూచించారు.


