News March 14, 2025
చొప్పదండి: పరీక్షల భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

చొప్పదండి మండలం రుక్మాపూర్కు చెందిన పూసాల రోహిత్(17) కరీంనగర్లోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం రోహిత్ పెద్దమ్మ రావుల అరుణ నిద్రలేచి చూడగా.. వరండాలో చీరతో ఉరేసుకుని కనిపించాడు. పరీక్షల్లో ఫెయిల్ అవుతాడనే భయంతో ఉరేసుకున్నట్లు ఎస్సై గొల్లపల్లి అనూష తెలిపారు. మృతుడి తల్లి కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
Similar News
News November 18, 2025
BHPL జిల్లాలో కనిష్ఠంగా 10 డిగ్రీలు నమోదు

రేగొండ, గోరి కొత్తపల్లి మండల గ్రామాల్లో చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. గ్రామాల్లో ఉదయం పొగమంచు, చలిగాలులు వీస్తుండగా, రాత్రి సమయంలో చలి తీవ్రత అధికంగా ఉంటుంది. గ్రామాల్లో ఉదయం కనిష్ఠంగా 10 నుంచి 12డిగ్రీలు, గరిష్ఠంగా 29 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ఉదయం ప్రయాణించే ప్రయాణికులు పొగమంచుతో ఇబ్బందులు పడుతున్నారు.
News November 18, 2025
BHPL జిల్లాలో కనిష్ఠంగా 10 డిగ్రీలు నమోదు

రేగొండ, గోరి కొత్తపల్లి మండల గ్రామాల్లో చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. గ్రామాల్లో ఉదయం పొగమంచు, చలిగాలులు వీస్తుండగా, రాత్రి సమయంలో చలి తీవ్రత అధికంగా ఉంటుంది. గ్రామాల్లో ఉదయం కనిష్ఠంగా 10 నుంచి 12డిగ్రీలు, గరిష్ఠంగా 29 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ఉదయం ప్రయాణించే ప్రయాణికులు పొగమంచుతో ఇబ్బందులు పడుతున్నారు.
News November 18, 2025
హిడ్మాపై రూ.6 కోట్ల రివార్డ్

దళ సభ్యుడిగా 1996లో మావోయిస్టుల్లో చేరిన హిడ్మా పెద్దగా తుపాకీ పట్టలేదు. కానీ క్యాడర్కు ఎప్పుడు? ఎక్కడ? ఎలా? దాడి చేయాలనే వ్యూహాలు, సూచనలిస్తాడు. దేశంలో పోలీసులు, ప్రముఖ నేతలపై జరిగిన 26 పెద్ద దాడులకు హిడ్మానే నాయకత్వం వహించాడు. అతడిపై కేంద్ర రూ.45 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వాలది కలిపి ఇది రూ.6కోట్ల రివార్డ్ ఉంది. కాగా ఇవాళ అల్లూరి జిల్లాలో హిడ్మా ఎన్కౌంటర్ మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బే.


