News March 11, 2025

చోడవరం: ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీ రైతులను ఆదుకోవాలి- బొత్స

image

గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులతో వైసీపీ నేతలు సోమవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, అమర్నాథ్, బూడి, ధర్మశ్రీ, అదీప్ రాజ్ చెరుకు రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ నేత బొత్స మాట్లాడుతూ.. ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం కాదు రైతులను ఆదుకోవాలన్నారు. రాజకీయాల కోసం నేను రాలేదని, రైతుల బాధలు చూసి ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News March 19, 2025

NRPT: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

image

నారాయణపేట మండలం జలాల్‌పూర్ గ్రామ స్టేజీ సమీపంలో బుధవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా హత్య చేశారా, లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 19, 2025

గుర్ల: పాము కాటుతో ఇంటర్ విద్యార్ధిని మృతి

image

పాము కాటుతో ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన విజయనగరం జిల్లా గుర్ల మండలం ఫకీర్ కిట్టలి పంచాయతీ బూర్లే పేటలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. ద్వారపూడి మౌనిక అనే విద్యార్థినికి అర్ధరాత్రి ఇంటివద్దనే నాగుపాము కాటువేసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు హుటాహుటిన విజయనగరం మహారాజా ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. మార్గ మధ్యంలోనే ఆమె మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News March 19, 2025

ఇంకోసారి అలా అనొద్దు.. ABDకి కోహ్లీ సూచన

image

ఐపీఎల్-2025కి ముందు ఆర్సీబీ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘ఈసాల కప్ నమ్దే’ (ఈసారి కప్ మనదే) నినాదాన్ని ఇకపై పబ్లిక్‌లో వాడొద్దని కోహ్లీ తనకు మెసేజ్ చేసినట్లు తెలిపారు. ‘వరల్డ్ కప్‌ను ఈజీగా గెలవచ్చేమో కానీ ఐపీఎల్ ట్రోఫీని గెలవడం అంత సులభం కాదు. ఈ టోర్నీ చాలా కఠినతరంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. 2011-21 మధ్య ABD ఆర్సీబీకి ఆడిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!