News April 7, 2025
చౌటుప్పల్: ఉరేసుకుని ఒకరి సూసైడ్

వృద్ధుడు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన చౌటుప్పల్ మున్సిపాటిటీ తంగడపల్లిలో జరిగింది. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన రాములు ఈ నెల 4న పెన్షన్ తీసుకోవడానికి చౌటుప్పల్ నుంచి తంగడపల్లికి వెళ్లాడు. ఆదివారం సాయంత్రం కొడుకు రాములుకి ఫోన్ చేశాడు. లిఫ్ట్ చేయకపోవడంతో పక్కింటి వారికి సమాచారం అందించాడు. వారు చూడగా ఇంట్లో ఉరేసుకుని కనిపించాడు. కుమారుడు బిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
Similar News
News November 21, 2025
విశాఖ ‘ఖాకీ’లపై ప్రత్యేక నిఘా..!(1/1)

రాష్ట్ర ఆర్థిక రాజధానిగా వృద్ధి చెందుతున్న విశాఖలో పలువురి <<18351380>>పోలీసుల తీరు<<>> చర్చకు దారి తీస్తోంది. సివిల్ సెటిల్మెంట్లు, రాజకీయ పైరవీలతో అంటకాగుతున్నారనే ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఇటీవల దువ్వాడలో రూ.కోట్ల విలువైన భూమి కోసం ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. లా అండ్ ఆర్ఢర్ కోణంలో ఈ ఇష్యూలో ఎంటరైన ఓ సీఐ సెటిల్మెంట్కు యత్నించటం ఉన్నతాధికారుల ద్రుష్టికి వెళ్ళింది. గతంలో ఆర్ఐ స్వర్ణలత ఇష్యూ సంచలనమైన సంగతి తెలిసిందే.
News November 21, 2025
విశాఖ ‘ఖాకీ’లపై ప్రత్యేక నిఘా..!(1/2)

విశాఖలో దీర్ఘకాలంగా పాతుకుపోయిన కొందరు పోలీసు అధికారులు ఇష్టారీతిన వ్యవహిస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో ఉన్నతాధికారులు అవినీతి పోలీసుల పనితీరుపై స్పెషల్ టీంతో నిఘా పెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీపీ దృష్టిలో ఏ అధికారిపై రిమార్క్స్ ఎక్కువ వచ్చాయి? ఎవరి మీద యాక్షన్ ఉంటుంది? అన్న భయం ఖాకీల గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టిస్తోంది. మీ పరిధిలో పోలీసులు పనితీరుపై కామెంట్ చెయ్యండి.
News November 21, 2025
ప.గో: రూ. 2కోట్లు గోల్ మాల్ ?

తణుకులోని ఓ ప్రైవేటు బ్యాంకులో తాకట్టు బంగారం గోల్మాల్ అయిన వ్యవహారం రాజుకుంటోంది. గతంలో ఇక్కడ పనిచేసిన సిబ్బందితో చేతులు కలిపిన తణుకు శాఖ మేనేజర్ ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని సొంత అవసరాలకు వాడుకున్న వ్యవహారం తాజాగా వెలుగు చూసింది. ఖాతాదారులు నిలదీయడంతో బ్యాంకు అధికారులు బయట బంగారం కొనుగోలు చేసి ఇచ్చారు. ఇలా సుమారు రూ.2 కోట్లు విలువైన బంగారాన్ని దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోంది.


