News February 28, 2025
చౌటుప్పల్: కండక్టర్పై ప్రయాణికుడి దాడి

కండక్టర్పై ప్రయాణికుడు దాడి చేసిన ఘటన చౌటుప్పల్లో జరిగింది. సీఐ వివరాలు.. పట్టణానికి చెందిన జంగయ్య దిల్సుఖ్నగర్లో బస్సు ఎక్కాడు. టికెట్ తీసుకునే క్రమంలో కండక్టర్ శ్రీధర్ రెడ్డి చిల్లర లేదని వెనకాల రాసి ఇచ్చాడు. బస్సు దిగగానే ముగ్గురికి కలిపి డబ్బులు ఇవ్వగా జంగయ్య గొడవ పడి క్షణికావేశంలో దాడి చేశాడు. శ్రీధర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు.
Similar News
News November 27, 2025
సర్పంచ్ ఎన్నికలు.. Te-Poll యాప్తో ఈజీగా..

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం Te-Poll అనే మొబైల్ యాప్ తీసుకొచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో పౌరులు తమ పోలింగ్ స్టేషన్ వివరాలు తెలుసుకోవడంతో పాటు ఓటర్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవచ్చని SEC తెలిపింది. అలాగే ఫిర్యాదులను సులభంగా అప్లోడ్ చేసి, వాటిని ట్రాక్ చేయవచ్చని పేర్కొంది.
Share It
News November 27, 2025
నెల్లూరు జిల్లాకు మరోసారి భారీ వర్షం..!

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈనెల 29, 30 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం ప్రకటన విడుదల చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిన నేపథ్యంలో ఈ ప్రభావం నెల్లూరు జిల్లాపై ఉండనున్నట్లు అధికారులు ప్రకటించారు. రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News November 27, 2025
జనగామ: బాల్య వివాహ నిర్మూలనకు ప్రత్యేక ప్రచార పోస్టర్ ఆవిష్కరణ

జనగామ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో వందరోజుల “చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ తెలంగాణ, భారత్” కార్యక్రమంలో జనగామ జిల్లా పరిపాలన కీలక నిర్ణయాలు చేపట్టింది. బాల్య వివాహాల నిర్మూలనకు సంబంధించిన ప్రత్యేక ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు. జిల్లా సంక్షేమ అధికారి కోదండరాములు మాట్లాడుతూ.. బాల్యవివాహాలు పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని, వాటి నివారణకు ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలన్నారు.


