News February 28, 2025
చౌటుప్పల్: కండక్టర్పై ప్రయాణికుడి దాడి

కండక్టర్పై ప్రయాణికుడు దాడి చేసిన ఘటన చౌటుప్పల్లో జరిగింది. సీఐ వివరాలు.. పట్టణానికి చెందిన జంగయ్య దిల్సుఖ్నగర్లో బస్సు ఎక్కాడు. టికెట్ తీసుకునే క్రమంలో కండక్టర్ శ్రీధర్ రెడ్డి చిల్లర లేదని వెనకాల రాసి ఇచ్చాడు. బస్సు దిగగానే ముగ్గురికి కలిపి డబ్బులు ఇవ్వగా జంగయ్య గొడవ పడి క్షణికావేశంలో దాడి చేశాడు. శ్రీధర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు.
Similar News
News November 24, 2025
కాపర్ టి-రకాలు

అవాంఛిత గర్భధారణను నివారించడానికి డాక్టర్లు కాపర్ టిని సూచిస్తారు. దీంట్లో రెండు రకాలున్నాయి. ఒకటి హార్మోనల్, మరొకటి నాన్ హార్మోనల్. హార్మోన్ కాపర్-టిలో లెవోనార్జెస్ట్రెల్ అనే హార్మోన్ విడుదలై శుక్రకణాలు అండం వద్దకు చేరకుండా ఆపుతుంది. నాన్ హార్మోనల్ కాపర్ టి రాగి అయాన్లను విడుదల చేస్తుంది. ఇవి శుక్రకణాలను, అండాలను నాశనం చేస్తాయి. వైద్యుల సలహాతో మీకు ఏది సరిపోతుందో తెలుసుకొని వాడటం మంచిది.
News November 24, 2025
బొత్తప్పగూడెం: సంగంవాగులో మునిగి యువకుడు మృతి

వాగులో స్నానానికి దిగిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు మునిగపోయిన ఘటన కామయ్యపాలెం పంచాయతీ బొత్తప్పగూడెంలో ఆదివారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు..తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేటలోని దొంతికుంట కాలనికి చెందిన గుమ్మళ్ల యశ్వంత్ స్నేహితులతో కలిసి స్నానానికి సంగం వాగులో దిగి గల్లంతయ్యాడు. తోటివారి సమాచారంతో సమీపంలో ఉన్నవారు వాగులో గాలించి బాలుడి డెడ్ బాడీని బయటకు తీశారు.
News November 24, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో సర్పంచ్ రిజర్వేషన్లు ఇవే

ఆసిఫాబాద్ జిల్లాలోని 335 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ రిజర్వేషన్లు ఈ విధంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 335 గ్రామ పంచాయతీలు, 2,874 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు 198, ఎస్సీ 32, బీసీ 20, జనరల్ 85 స్థానాలు కేటాయించారు. డిసెంబర్ రెండో వారంలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు.


