News February 28, 2025

చౌటుప్పల్‌: కండక్టర్‌పై ప్రయాణికుడి దాడి

image

కండక్టర్‌పై ప్రయాణికుడు దాడి చేసిన ఘటన చౌటుప్పల్‌లో జరిగింది. సీఐ వివరాలు.. పట్టణానికి చెందిన జంగయ్య దిల్‌సుఖ్‌నగర్‌‌లో బస్సు ఎక్కాడు. టికెట్ తీసుకునే క్రమంలో కండక్టర్‌ శ్రీధర్ రెడ్డి చిల్లర లేదని వెనకాల రాసి ఇచ్చాడు. బస్సు దిగగానే ముగ్గురికి కలిపి డబ్బులు ఇవ్వగా జంగయ్య గొడవ పడి క్షణికావేశంలో దాడి చేశాడు. శ్రీధర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు.

Similar News

News November 19, 2025

పండ్ల తోటల్లో పిందె/కాయలు ఎందుకు రాలిపోతాయి?

image

పండ్ల తోటల్లో పుష్పాలు సరిగా సంపర్కం చెందకపోతే పిందె సరిగా కట్టదు. ఒకవేళ కట్టినా కాయలు ఎదగక మధ్యలోనే రాలిపోతాయి. తోటల్లో సజ్రతని, బోరాన్, కాల్షియం, పొటాష్ పోషకాలు, హోర్మోన్ల లోపం వల్ల కూడా పిందెలు, కాయ ఎదిగే దశల్లో రాలిపోతాయి. రసం పీల్చే పురుగులు, పండు ఈగ, ఆకుమచ్చ, బూడిద తెగుళ్లు, అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులు, రాత్రివేళ అల్ప ఉష్ణోగ్రతలు, ఆకస్మిక వర్షాల వల్ల పండ్ల తోటల్లో పిందెలు, కాయలు రాలుతాయి.

News November 19, 2025

వరంగల్ కమిషనరేట్ పరిధిలో 121 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

image

మందు బాబులు వాహనాలు నడపడం కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 121 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ పరిధిలోనే 51 కేసులు ఉన్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, వాహనం సీజ్ చేసి కౌన్సిలింగ్ ఇస్తామని పోలీసులు వాహనదారులను హెచ్చరించారు.

News November 19, 2025

ఆ భయంతోనే ఛత్తీస్‌గఢ్ నుంచి ఏపీకి!

image

లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఎక్కడ తమ వివరాలు బయటపెడతారేమోనని మిగతా నేతలు భయపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అనేక మంది ఛత్తీస్‌గఢ్ నుంచి APకి వచ్చి తలదాచుకుంటున్నారని సమాచారం. ఎలాంటి భయం లేకుండా లొంగిపోవడానికి రావాలని, తాము రక్షణ కల్పిస్తామని ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా చెప్పారు. అటు హిడ్మాను పట్టుకుని కాల్చి చంపినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. హిడ్మా ఎన్‌కౌంటర్‌లోనే చనిపోయాడన్నారు.