News April 1, 2025

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్‌.. జనగామ జిల్లా మహిళా మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్‌లో జనగామ జిల్లాకు చెందిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ భాను మృతి చెందారు. రేణుకది దేవరుప్పుల మండలం కడవెండి. గ్రామంలో ఆమె మృతిపై తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆమె మరణాన్ని నిరసిస్తూ భావోద్వేగంతో స్పందిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాల కోసం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Similar News

News November 22, 2025

GHMC నోటీసులపై రామానాయుడు స్టూడియోస్ క్లారిటీ

image

జీహెచ్ఎంసీ <<18346319>>నోటీసులపై<<>> రామానాయుడు స్టూడియోస్ స్పష్టత ఇచ్చింది. తాము వినియోగిస్తున్న స్థలాన్ని తక్కువగా చూపించట్లేదని ప్రకటనలో తెలిపింది. ఎప్పటి నుంచో 68,276 చదరపు అడుగులకు ఆస్తి పన్ను కడుతున్నట్లు వెల్లడించింది. జీహెచ్ఎంసీ నిర్దేశించిన ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించినట్లు పేర్కొంది. GHMC నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా నడుచుకుంటున్నట్లు స్పష్టం చేసింది.

News November 22, 2025

ప్రభుత్వ ఆస్పత్రుల నిర్లక్ష్యంపై CM ఆగ్రహం

image

AP: ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంపై CM చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. కాకినాడ GGHలో గడిమొగకు చెందిన 8నెలల గర్భిణి మల్లేశ్వరి ప్రాణాలు కోల్పోవడం, రాజమండ్రి ఆసుపత్రిలో 55ఏళ్ల రోగికి ఎక్స్‌పైరైన మందులివ్వడంతో ఆ రోగి మరింత అనారోగ్యం పాలయ్యారు. ఈ ఘటనలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

News November 22, 2025

కడప: వీరికి కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు

image

కడప జిల్లాలోని ఇద్దరికి కూటమి ప్రభుత్వం కార్పొరేషన్ ఛైర్మన్లుగా నియమించింది. వీరిలో ప్రొద్దుటూరు మాజీ మున్సిపల్ ఛైర్మన్ ముక్తియార్‌కు ఏపీ స్టేట్ షేక్/షీక్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని ఇచ్చారు. అలాగే కడపకు చెందిన యాతగిరి రాంప్రసాద్‌ను ఏపీ ఫిషర్ మెన్ కో ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించారు.