News April 1, 2025

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్‌.. జనగామ జిల్లా మహిళా మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్‌లో జనగామ జిల్లాకు చెందిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ భాను మృతి చెందారు. రేణుకది దేవరుప్పుల మండలం కడవెండి. గ్రామంలో ఆమె మృతిపై తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆమె మరణాన్ని నిరసిస్తూ భావోద్వేగంతో స్పందిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాల కోసం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Similar News

News November 11, 2025

నేడు మూడు చోట్ల ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన

image

అనకాపల్లి జిల్లాలో గల మూడు నియోజకవర్గాల్లో మంగళవారం ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపనలు నిర్వహించనున్నట్లు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ ఎస్.నరసింహారావు తెలిపారు. సోమవారం మాకవరపాలెం మండలంలోని ఎరకన్నపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కు స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సీపట్నం నియోజకవర్గంలో గల ఎరకన్నపాలెం, నక్కపల్లి, పరవాడలో ఎంఎస్‌ఎంఈ పార్కులకు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేయనున్నారు.

News November 11, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 11, 2025

భద్రాది: జిల్లా స్థాయి క్విజ్‌లో మామిళ్లవారిగూడెం విద్యార్థి

image

టీఎస్ జీహెచ్ఎంఏ, టీఎస్ఏటీ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి క్విజ్ పోటీల్లో అశ్వారావుపేట మండల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మామిళ్లవారిగూడెం జడ్పీహెచ్ఎస్ విద్యార్థి మద్దాల ప్రవీణ్‌కుమార్ కన్సోలేషన్ బహుమతి పొందాడు. మండల స్థాయిలో నారాయణపురం, గుమ్మడవల్లి, అశ్వారావుపేట జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు క్విజ్‌, వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో రాణించారు. ఎంఈఓ ప్రసాదరావు, ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ అభినందించారు.