News April 1, 2025

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్‌.. జనగామ జిల్లా మహిళా మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్‌లో జనగామ జిల్లాకు చెందిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ భాను మృతి చెందారు. రేణుకది దేవరుప్పుల మండలం కడవెండి. గ్రామంలో ఆమె మృతిపై తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆమె మరణాన్ని నిరసిస్తూ భావోద్వేగంతో స్పందిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాల కోసం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Similar News

News November 23, 2025

సర్వేలులో పీవీ, నారాయణరెడ్డి కాంస్య విగ్రహాల ఆవిష్కరణ

image

ప్రతి విద్యార్థికి చదువు, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. సర్వేలు గురుకుల విద్యాలయంలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎమ్మెల్సీ వాణీదేవితో కలిసి ఆయన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, భూదానోద్యమ నాయకుడు, గురుకుల స్థలదాత మద్ది నారాయణరెడ్డిల కాంస్య విగ్రహాలను ఆవిష్కరించారు.

News November 23, 2025

యూనివర్సిటీ ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి

image

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రాంగణాన్ని పరిశీలించారు. డిసెంబర్ 2న ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, కోరం కనకయ్య, తెల్లం వెంకటరావు, రాందాస్ నాయక్, కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తదితరులతో మంత్రి సమీక్షించారు.

News November 23, 2025

పర్సనల్ లైఫ్ తప్ప పైరసీపై నోరుమెదపని iBOMMA రవి?

image

iBOMMA నిర్వాహకుడు రవి నాలుగో రోజు విచారణలో తన లైఫ్‌స్టైల్ గురించి పలు విషయాలు వెల్లడించినట్లు సమాచారం. ‘పైరసీతో వచ్చిన డబ్బులను ఎప్పటికప్పుడు ఖర్చు చేశా. 15-20 రోజులకొకసారి విదేశాలకు వెళ్లాను. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, US, ఫ్రాన్స్, థాయ్‌లాండ్, దుబాయ్ తదితర దేశాలు తిరిగాను’ అని చెప్పినట్లు తెలుస్తోంది. పర్సనల్ విషయాలు తప్ప పైరసీ నెట్‌వర్క్ గురించి నోరు తెరవలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.