News March 26, 2025

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. HNK జిల్లాలో విషాదం

image

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్- దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మరి కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో HNK జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామానికి చెందిన మావోయిస్టు అంకేశ్వరం సారయ్య అలియాస్ సుధీర్, సుధాకర్, మురళి మృతి చెందారు. 1990లో ఇంటి నుంచి బయటి వెళ్లిన సారయ్య ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. సారయ్యపై రూ.25 లక్షల రివార్డ్ ఉంది.

Similar News

News December 2, 2025

టెస్లా కార్లపై ఆసక్తి చూపని భారతీయులు!

image

భారతీయ మార్కెట్‌లో టెస్లా కార్లకు ఆశించిన స్థాయిలో స్పందన లభించట్లేదు. OCTలో 40, NOVలో 48 కార్లే అమ్ముడయ్యాయి. JULY నుంచి ఇప్పటి వరకు మొత్తం 157 కార్లనే విక్రయించింది. అధిక ధరలు, విపరీతమైన పోటీ కారణంగా ఇండియన్స్ ఆసక్తి చూపట్లేదని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే ఛార్జింగ్ స్టేషన్ల కొరత కూడా అమ్మకాలను ప్రభావితం చేస్తోందని చెబుతున్నారు. కాగా మోడల్ Y ధర రూ.60లక్షలకు పైగా ఉంది.

News December 2, 2025

ఆదిలాబాద్: రూ.30 పెరిగిన పత్తి ధర

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో మంగళవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,060గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,940గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో ఎటువంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. ప్రైవేట్ ధర రూ. 30 పెరిగినట్లు వెల్లడించారు.

News December 2, 2025

నల్గొండ: పవన్ కళ్యాణ్ SORRY చెప్పాలి: కోమటిరెడ్డి

image

తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరిచేలా పవన్‌ కళ్యాణ్ మాట్లాడారని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. పవన్ ఉద్దేశపూర్వకంగా మాట్లాడారో, తెలియక మాట్లాడారో తనకు తెలియదన్నారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే, తెలంగాణలో ఆయన సినిమాలు ఆడబోవని మంత్రి హెచ్చరించారు.