News March 26, 2025
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. HNK జిల్లాలో విషాదం

ఛత్తీస్గఢ్లోని బీజాపూర్- దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మరి కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఎన్కౌంటర్లో HNK జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామానికి చెందిన మావోయిస్టు అంకేశ్వరం సారయ్య అలియాస్ సుధీర్, సుధాకర్, మురళి మృతి చెందారు. 1990లో ఇంటి నుంచి బయటి వెళ్లిన సారయ్య ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. సారయ్యపై రూ.25 లక్షల రివార్డ్ ఉంది.
Similar News
News December 9, 2025
పోస్టల్ బ్యాలెట్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

రెండవ, మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో విధులకు వెళ్లే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవార్ సూచించారు. రెండవ విడత మండలాల్లో డిసెంబర్ 7-10, మూడవ విడత మండలాల్లో 10,12,13,15 తేదీల్లో ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
News December 9, 2025
జామపండు తింటే ఎన్నో లాభాలు!

మార్కెట్లో విరివిగా లభించే జామపండును పోషకాల పవర్ హౌస్ అని పిలుస్తారు. ఇది నారింజ కంటే 4 రెట్లు అధికంగా విటమిన్ C అందించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉన్న పీచుపదార్థం చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. కేవలం 60-70క్యాలరీలు మాత్రమే ఉండటం వల్ల బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. దేశీయ సూపర్ ఫ్రూట్ అయిన జామను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. share it
News December 9, 2025
ఘోర అగ్నిప్రమాదం.. 20 మంది మృతి

ఇటీవల తుఫాన్ బీభత్సంతో అతలాకుతలమైన ఇండోనేషియాలో మరో ఘోర ప్రమాదం సంభవించింది. రాజధాని జకార్తాలో ఓ ఏడంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం జరిగి 20 మంది మరణించారు. మరికొంత మంది గాయపడ్డారు. ఏరియల్ సర్వే కోసం ఉపయోగించే డ్రోన్ల తయారీ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో మొదలైన మంటలు వెంటనే భవనమంతా వ్యాపించాయి. ఆ సమయంలో కొందరు ఉద్యోగులు భోజనం చేస్తున్నారు. మంటలు చుట్టుముట్టడంతో వారంతా సజీవదహనం అయ్యారు.


