News March 26, 2025
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. HNK జిల్లాలో విషాదం

ఛత్తీస్గఢ్లోని బీజాపూర్- దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మరి కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఎన్కౌంటర్లో HNK జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామానికి చెందిన మావోయిస్టు అంకేశ్వరం సారయ్య అలియాస్ సుధీర్, సుధాకర్, మురళి మృతి చెందారు. 1990లో ఇంటి నుంచి బయటి వెళ్లిన సారయ్య ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. సారయ్యపై రూ.25 లక్షల రివార్డ్ ఉంది.
Similar News
News November 14, 2025
NZB: జిల్లా కాంగ్రెస్ భవన్ లో నెహ్రు జయంతి వేడుకలు

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) భవన్లో శుక్రవారం భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు.
News November 14, 2025
₹11,399 కోట్లతో 419 రోడ్ల విస్తరణ, అభివృద్ధి

TG: హ్యామ్ విధానంలో 419 రోడ్ల విస్తరణ, అభివృద్ధికి ప్రభుత్వం నిర్ణయించింది. ₹11,399.33 కోట్లతో 5824 KM మేర రహదారులను తీర్చిదిద్దనుంది. ఫేజ్1లో నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, నల్గొండ, సిద్దిపేట, కుమరంభీం జిల్లాల్లోని 30 రోడ్ల అభివృద్ధికి ఉత్తర్వులిచ్చింది. కాగా గతంలో అనుమతులిచ్చిన 7 రోడ్లను ఫేజ్1 నుంచి తొలగించి కొత్తవి చేర్చారు. GO విడుదలతో టెండర్లు పిలవనున్నారు.
News November 14, 2025
23వేల ఆధిక్యంలో నవీన్ యాదవ్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ లీడ్ భారీగా పెరుగుతోంది. 8వ రౌండ్ ముగిసేసరికి నవీన్ యాదవ్ 23వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వరుసగా 8 రౌండ్లలో ఆయన లీడ్ సాధించడం విశేషం. మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్నాయి.


