News September 18, 2024

‘ఛానల్ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోండి’

image

గుంటూరు ఛానల్ ఆధునికరణ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. మంగళవారం పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర కుమార్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు ఇతర అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆధునికీకరణకు సంబంధించి ప్రతిపాదనలు త్వరితగతిన సిద్ధం చేసి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

Similar News

News November 19, 2025

గుంటూరు జిల్లా రైతుల ఖాతాల్లో ఎంత పడతాయంటే ?

image

అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ కింద రైతుల ఖాతాల్లో ప్రభుత్వం బుధవారం నిధులు జమ చేయనుంది. గుంటూరు జిల్లాలో 1,06,329 మంది రైతుల ఖాతాల్లో రూ.70 కోట్లు జమ కానున్నాయి. అన్నదాత సుఖీభవ కింద రూ.53.16 కోట్లు, అదేవిధంగా పీఎం కిసాన్ కింద రూ.16.84 కోట్లు జమ అవుతాయని అధికారులు తెలిపారు. జిల్లా స్థాయి కార్యక్రమం లామ్ ఫామ్ ఆడిటోరియంలో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి జరగనుంది. మంత్రి కందుల దుర్గేశ్ పాల్గొంటారు.

News November 19, 2025

గుంటూరు: యువతిని వేధించిన కేసులో నిందితుడికి జైలు శిక్ష

image

ప్రేమ పేరుతో యువతిని వెంబడించి వేధించిన కేసులో నిందితుడు పాత గుంటూరు సయ్యద్ జుబేర్ అహ్మద్‌కు మొదటి AJCJ కోర్టు 7 నెలల జైలు శిక్షతో పాటు రూ.3,000 జరిమానా విధించింది. 2019లో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి, పోలీసులు సాక్ష్యాలతో కోర్టుకు సమర్పించగా తీర్పు వెలువడింది. ఇలాంటి మహిళలపై దాడులు, వేధింపులను కఠినంగా ఎదుర్కొంటామని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.

News November 19, 2025

వల్లభాపురం: ప్రమాదవశాత్తు యంత్రంలో పడి మహిళ మృతి

image

కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామపంచాయతీ పరిధిలోని మాదిగ లంకకు మినుములు నూర్చడానికి వచ్చిన మహిళ ప్రమాదవశాత్తు చనిపోయినట్లు కొల్లిపర ఎస్సై పి.కోటేశ్వరరావు తెలిపారు. వల్లూరుపాలెంకు చెందిన షేక్ కాసింబి(40) ప్రమాదవశాత్తు మినుము నూర్పిడి యంత్రంలో చీర ఇరుక్కుని చేతులు, మెడకు తీవ్ర గాయాలై చనిపోయినట్లు తెలిపారు. ఆమె భర్త ఇస్మాయిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.