News February 4, 2025

జంగంపల్లి చెరువులో మృతదేహం కలకలం

image

బిక్కనూర్ మండలం జంగంపల్లి పెద్ద చెరువులో మంగళవారం గుర్తు తెలియని శవాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికులు గ్రామపంచాయతీ సిబ్బందికి సమాచారం అందించగా పంచాయతీ కార్యదర్శి గుడిసె బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 27, 2026

DINK జంటలకూ డబ్బు సరిపోవట్లేదు!

image

పిల్లల బాధ్యత, ఖర్చుల నుంచి తప్పించుకునేందుకు చాలా జంటలు డ్యుయల్ ఇన్‌కమ్, నో కిడ్స్ (DINK) పాలసీని ఫాలో అవుతున్నాయి. కానీ వీరిలో చాలా మందికి సంపాదన సరిపోవడం లేదు. పొదుపుపై దృష్టి పెట్టకుండా ఆదాయాన్ని ఖర్చులు, జల్సాలకు వాడుకోవడం.. ఒకరి ఖర్చులు మరొకరు పట్టించుకోకపోవడం, ఆదాయానికి తగినట్టు ఖర్చులు పంచుకోకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు. ఆదాయంతో సంపద పెరుగుతుంది అనుకోవడం పొరపాటని నిపుణులు చెబుతున్నారు.

News February 27, 2026

ప్రతి పోలీసుకు అండగా ఉంటాం: SP

image

నెల్లూరు ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం ‘డయల్ యువర్ ఎస్పీ’ (SP-సంపర్క్) కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో 13 మంది సిబ్బంది తమ బదిలీలు, మెడికల్ బిల్లులు, ప్రమోషన్ల వంటి అంశాలను నేరుగా ఎస్పీకి ఫోన్ ద్వారా వివరించారు. ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎస్పీ క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతి పోలీస్ వెనుక శాఖ ఉంటుందని భరోసా ఇచ్చారు.

News February 27, 2026

చిత్తూరు: ‘తక్షణమే రైతులకు డ్రిప్ పరికరాలు ఇవ్వాలి’

image

కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం మైక్రో ఇరిగేషన్‌పై సమీక్ష నిర్వహించారు. అర్హత కలిగిన రైతులందరికీ తక్షణమే సర్వే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రైతు వాటా చెల్లించిన వారికి వెంటనే మైక్రో ఇరిగేషన్ పరికరాలు అందజేయాలని ఆయన సూచించారు. డ్రిప్ పరికరాలు మంజూరైన 1386 మందికి మెటీరియల్ పంపిణీ చేయాలన్నారు. మెటీరియల్ అందుకున్న రైతులకు ఇన్స్టాలేషన్ చేయాలన్నారు.