News October 7, 2024
జంగారెడ్డిగూడెం: యువకుడిపై పోక్సో కేసు నమోదు
జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఓ బాలిక గత నెల 30న ఇంటి నుంచి అదృశ్యమైంది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఏలూరులోని షారుఖ్ ఖాన్పై అనుమానం ఉన్నట్లు తల్లి చెప్పడంతో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారు కడపలో ఉన్నట్లు తెలిసింది. నిందితుడు మాయమాటలు చెప్పి బాలికను ఇంటి నుంచి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు గుర్తించారు. దీంతో అదృశ్యం కేసును పోక్సో కేసుగా మార్పు చేశామన్నారు.
Similar News
News October 7, 2024
ఏలూరు జిల్లాలో యువతకు ఉచిత శిక్షణ
ఏలూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు DLTC ప్రధానాచార్యుడు ఎస్.ఉగాది రవి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి కౌశల్ వికాశ్ యోజన కింద ఆఫీసు అపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ కోర్సులో 4 నెలలు ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు. ఇంటర్ ఆపైన చదివిన వాళ్లు, 15 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు అర్హులని తెలిపారు. ఈనెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News October 7, 2024
ఇసుకపై ఏలూరు జేసీ కీలక ప్రకటన
ఏలూరు జిల్లాలో ప్రస్తుతం నెలకు సరిపడా ఇసుక ఉందని జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి వెల్లడించారు. ఉచిత ఇసుక విధానం అమలుపై ఎస్పీ ప్రతాప్ శివకిషోర్తో కలిసి జేసీ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పట్టిసీమ, గూటాల, గూటాల-1 డీ-సిల్టేషన్ పాయింట్స్ ద్వారా త్వరలో ఇసుక అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. ఇసుక విషయంలో సమస్యలు ఎదురైతే 88865 42999, 95339 22444, 9493040757కు కాల్ చేయవచ్చని సూచించారు.
News October 7, 2024
ఏలూరు: మ్యాట్రిమోనిలో పరిచయం.. 4 పెళ్లిళ్లు.. చివరికి అరెస్ట్
మ్యాట్రిమోనీ ద్వారా సేకరించిన వివరాలను ఆధారంగా చేసుకుని పెళ్లిచూపుల పేరుతో ఇప్పటివరకు 4 వివాహాలు చేసుకున్న ఆశం అనిల్ బాబు అలియాస్ కళ్యాణ్ రెడ్డిని సోమవారం ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ వివరాలు వెల్లడించారు. నెల్లూరు జిల్లాకు చెందిన కళ్యాణ్ రెడ్డితో పాటు సహకరించిన తుంగ శశాంక పల్లె హేమంత్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు.