News March 6, 2025
జంగారెడ్డిగూడెం: 6న గీత కులాల మద్యం షాపుల డ్రాలు

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరిలో జరగాల్సిన గీతకులాల మద్యం షాపుల ఆన్లైన్ విధానం వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల కోడ్ ముగియడంతో జంగారెడ్డిగూడెం మండలంలో దరఖాస్తులు చేసుకున్న వారందరూ 6వ తేదీ ఉదయం 8. గంటలకు డ్రా ఉంటుందన్నారు. ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి మీటింగ్ హాల్లో జరుగు డ్రాలో పాల్గొనాలని జంగారెడ్డిగూడెం సీఐ శ్రీనుబాబు కోరారు. దరఖాస్తు దారులు అందరూ హాజరు కావాలన్నారు.
Similar News
News April 17, 2026
3,106 చెరువుల్లో ఉపాధి పనులు: చిత్తూరు కలెక్టర్

‘జలధార-నీటి భద్రత’ పనులతో చిత్తూరు జిల్లాలో భూగర్భ జలమట్టం పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. 3,106 చెరువుల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టాలని సూచించారు. నీటి నిల్వలు పెంపు, సాగునీటి బలోపేతం, కరవు నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్కు 3 చెరువులు కేటాయించి, అధికారులు బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు.
News April 17, 2026
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: SP సుబ్బరాయుడు

సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అవగాహనతో ఉండాలని తిరుపతి SP సుబ్బరాయుడు సూచించారు. గురువారం SP కార్యాలయం నుంచి బ్యాంకర్లు, పోలీసు అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, లింకులను నమ్మవద్దని కోరారు. OTP, పిన్ నంబర్లు, బ్యాంక్ వివరాల వంటి గోప్య సమాచారాన్ని ఎవరికీ చెప్పవద్దని సూచించారు.
News April 17, 2026
సౌందర్య.. అచ్చ తెలుగు ఆడపడుచులా!

టాలీవుడ్లో మహానటి సావిత్రి తర్వాత అంతటి అభిమానం పొందిన హీరోయిన్లలో సౌందర్య ఒకరు. ‘మనవరాలి పెళ్లి’తో 1993లో తెలుగు సినిమాల్లోకి వచ్చి పదేళ్లు సినీరంగాన్ని ఏలారు. 100కుపైగా మూవీస్లో నటించారు. అసభ్య వస్త్రధారణకు దూరంగా నిండైన చీరకట్టుతో అచ్చ తెలుగు ఆడపడుచులా కనిపించేవారు. కానీ చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 2004లో జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూశారు. నేడు సౌందర్య వర్ధంతి.


