News August 25, 2024

జగదేవ్పూర్: తల్లిదండ్రుల సూసైడ్.. అనాథలైన చిన్నారులు

image

జగదేవ్పూర్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన శేఖర్, సౌమ్య దంపతులు నెల రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రుల మృతితో వారి ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు. చిన్నారులకు గజ్వేల్ మనం ఫౌండేషన్ సహాయం చేసేందుకు ముందుకొచ్చింది. అధ్యక్షుడు స్వామి, సభ్యులు కనకయ్య, ఆంజనేయులు వారికి రూ.10వేలు అందజేసి మానవత్వం చాటుకున్నారు. పిల్లలకు సాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలాలని కోరారు.

Similar News

News January 4, 2026

మెదక్: టెట్ పరీక్ష ప్రశాంతం: డీఈవో విజయ

image

మెదక్ జిల్లా నర్సాపూర్ బీవీఆర్ఐటీ కళాశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హతకు టెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు డీఈవో విజయ తెలిపారు. ఆదివారం రెండో రోజులో భాగంగా మొదటి పేపర్‌కు 100, రెండో పేపర్‌కు 100 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా మొదటి పేపర్‌కు 48 మంది హాజరు కాగా మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 71 మంది హాజరైనట్లు చెప్పారు. 81 మంది గైర్హాజరయ్యారన్నారు.

News January 4, 2026

అసెంబ్లీలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు ధ్వజం

image

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. అసభ్యకరమైన భాష, అబద్ధాల వరదతో ప్రజాస్వామ్య దేవాలయాన్ని అవమానించారని విమర్శించారు. బీఆర్ఎస్ న్యాయపోరాట ఫలితాలను సీఎం తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఇరిగేషన్ అంశాల్లో సీఎం అజ్ఞానం బయటపడిందని పేర్కొంటూ చేసిన ఆరోపణలకు పూర్తి సాక్ష్యాలతో తెలంగాణ భవన్ వేదికగా పీపీటీలో సమాధానం ఇస్తానని హరీష్ రావు స్పష్టం చేశారు.

News January 4, 2026

అసెంబ్లీలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు ధ్వజం

image

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. అసభ్యకరమైన భాష, అబద్ధాల వరదతో ప్రజాస్వామ్య దేవాలయాన్ని అవమానించారని విమర్శించారు. బీఆర్ఎస్ న్యాయపోరాట ఫలితాలను సీఎం తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఇరిగేషన్ అంశాల్లో సీఎం అజ్ఞానం బయటపడిందని పేర్కొంటూ చేసిన ఆరోపణలకు పూర్తి సాక్ష్యాలతో తెలంగాణ భవన్ వేదికగా పీపీటీలో సమాధానం ఇస్తానని హరీష్ రావు స్పష్టం చేశారు.