News February 25, 2025
జగన్కు మేమే టికెట్లు కొనిస్తాం: సోమిరెడ్డి

అసెంబ్లీకి రాని YCP ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉపఎన్నికలను ఎదుర్కోవాలని సర్వేపల్లి MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సవాల్ చేశారు. ‘జగన్ వైసీపీ ఫ్లోర్ లీడర్గా ప్రజల సమస్యలపై అసెంబ్లీలో ఎక్కువ సేపు మాట్లాడవచ్చు. ప్రతిపక్ష నేతలకు ఫ్రీగా విమానం టికెట్, కారుకు డీజిల్, పీఏను ఇస్తారు. జగన్కు ఫ్రీగా విమానం టికెట్లు కావాలంటే మేమే చందాలు వేసుకుని కొనిస్తాం’ అని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు.
Similar News
News November 19, 2025
మర్రిపాడు: నవోదయ విద్యార్థిని ఆత్మహత్య..UPDATE

మర్రిపాడు మండలం, కృష్ణాపురం నవోదయ విద్యాలయంలో దారుణం చోటు చేసుకుంది.10వ తరగతి చదువుతున్న ప్రణీత (14) అనే విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అర్ధరాత్రి 2 సమయంలో మెట్ల కమ్ములకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న బాలికను చూసి ఆయమ్మ ప్రిన్సిపల్కి సమాచారం ఇచ్చింది. బాలిక ప్రణీత కావలి రూరల్ అడవిరాజుపాలెం గ్రామం. బాలిక తండ్రి కొండాపురం ఎంఈఓగా పనిచేస్తున్నారు.
News November 19, 2025
మర్రిపాడు: నవోదయ విద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య

మర్రిపాడు మండలం కృష్ణాపురంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో సమాచారం అందుకున్న ఆత్మకూరు సీఐ గంగాధర్ విద్యాలయానికి చేరుకొని విద్యార్థిని మృతిపై విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 19, 2025
నెల్లూరులో చిక్కనంటున్న.. ఆకుకూరలు

మార్కెట్లో ఆకుకూరల ధరలు ఆకాశానంటుతున్నాయి. రూ. 20కి తోటకూర 3, చిర్రాకు 3, గోంగూర 3 కట్టలు ఇస్తున్నారు. గతంలో ఈ ధరకు రెట్టింపు ఇచ్చేవారు. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు తోటలు దెబ్బతిని ఉత్పత్తి తగ్గింది. ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకువడంతో ధరలు అమాంతం పెరిగాయి. వీటితోపాటు కూరగాయల ధరలు సైతం మండుతున్నాయి. దీంతో సామాన్యుడు జేబుకు చిల్లుపడుతోంది.


