News June 7, 2024

జగన్‌తో తిరుపతి ఎంపీ భేటీ

image

వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తిరుపతి ఎంపీగా గెలిచిన మద్దిల గురుమూర్తి గురువారం తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వైసీపీ ఓటమికి గల కారణాలను ఇరువురు కాసేపు చర్చించుకున్నారు. నాయకులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని జగన్, గురుమూర్తికి చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

Similar News

News December 9, 2025

నెల్లూరు: “సాదా బైనామాల”కు సదావకాశం

image

తెల్ల కాగితాలపై చేసుకున్న పొలాల కొనుగోలు ఒప్పంద పత్రాలకు మోక్షం కలగనుంది. సాదా బైనామాల కింద ఉన్న వీటి వలన పొలాలకు యాజమాన్య హక్కులు లేక, విక్రయించుకోలేక, ప్రభుత్వ పథకాలకు నోచుకోలేని పరిస్థితి. ఇలాంటివి సుమారు 18 వేల వరకు ఉన్నట్లు అంచనా. MRO లు క్షేత్రస్థాయిలో పరిశీలించి 90 రోజుల్లో పరిష్కరించేలా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. చిన్న, సన్నకారు రైతులకు మంచి రోజులు రానున్నాయి.

News December 9, 2025

నెల్లూరు: “సాదా బైనామాల”కు సదావకాశం

image

తెల్ల కాగితాలపై చేసుకున్న పొలాల కొనుగోలు ఒప్పంద పత్రాలకు మోక్షం కలగనుంది. సాదా బైనామాల కింద ఉన్న వీటి వలన పొలాలకు యాజమాన్య హక్కులు లేక, విక్రయించుకోలేక, ప్రభుత్వ పథకాలకు నోచుకోలేని పరిస్థితి. ఇలాంటివి సుమారు 18 వేల వరకు ఉన్నట్లు అంచనా. MRO లు క్షేత్రస్థాయిలో పరిశీలించి 90 రోజుల్లో పరిష్కరించేలా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. చిన్న, సన్నకారు రైతులకు మంచి రోజులు రానున్నాయి.

News December 9, 2025

గంటల వ్యవధిలో నిందితులను అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు

image

నగరంలో నిన్న సాయంత్రం బోసు బొమ్మ వద్ద రోడ్డుకు అడ్డంగా ఉన్న బైక్‌ను తీయమన్నందుకు సిటీ బస్సు డ్రైవర్, కండక్టర్‌పై బ్లేడ్‌తో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురు నిందితులను సంతపేట పోలీసులు గంటల వ్యవధిలో అరెస్ట్ చేశారు. పోలీసులు మాట్లాడుతూ.. నిందితులకు నేర చరిత్ర లేదని, క్షణికావేశంలో ఈ ఘటన జరిగిందన్నారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసుల తీరుపట్ల నగరవాసులు అభినందనలు తెలిపారు.