News June 7, 2024

జగన్‌తో తిరుపతి ఎంపీ భేటీ

image

వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తిరుపతి ఎంపీగా గెలిచిన మద్దిల గురుమూర్తి గురువారం తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వైసీపీ ఓటమికి గల కారణాలను ఇరువురు కాసేపు చర్చించుకున్నారు. నాయకులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని జగన్, గురుమూర్తికి చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

Similar News

News December 26, 2025

నెల్లూరులో ఆయనో డిఫరెంట్ MLA..?

image

నెల్లూరు జిల్లాలో తొలిసారి గెలిచిన ఓ MLA తీరును సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. పార్టీకి ఎప్పటి నుంచో అండగా ఉంటున్న వారిని సైతం దూరం పెట్టేస్తున్నారంట. తాను తప్ప నియోజకవర్గంలో ఎవరూ పెత్తనం చలాయించడానికి లేదని ముఖాన చెప్పేస్తున్నారంట. తనకు గిట్టని వాళ్లను హైలెట్ చేసేలా సొంత పార్టీ నాయకులు ఫ్లెక్సీలు వేసినా ఊరుకోవడం లేదంట. దగ్గరుండి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిన నేతకు సైతం ఆయన శత్రువుగా మారారట.

News December 26, 2025

నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని సీఎంని కోరా: ఆనం

image

రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరినట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. విభజన నోటిఫికేషన్‌కు సంబంధించి అభ్యంతరాలు తెలియజేయడానికి నేటితో ఆఖరి రోజు కావడంతో ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. నెల్లూరులో మంత్రి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

News December 26, 2025

నెల్లూరు: 104 వాహనాల్లో ఉద్యోగావకాశాలు

image

జిల్లాలోని 104 వాహనాల్లో డ్రైవర్లు, డేటాఎంట్రీ ఆపరేటర్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. డీఈవోలకు డిగ్రీ, కంప్యూటర్ కోర్సు, డ్రైవర్లకు టెన్త్ పాస్, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అవసరమని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు bhspl.in/careers ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. తిరుపతి రుయా ఆసుపత్రిలోని TB జిల్లా కార్యాలయంలో ఈనెల 27, 28 తేదీలలో సంప్రదించాలని కోరారు.