News December 6, 2024
జగన్తో సమావేశానికి ధర్మాన, దువ్వాడ గైర్హాజరు

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నేతలతో మాజీ సీఎం జగన్ బుధ, గురువారం కీలక సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని స్థానాల్లో వైసీపీ ఓడిపోవడంతో పలు అంశాలపై చర్చించారు. ఇంతటి కీలకమైన సమావేశానికి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు హాజరు కాలేదు. ఎన్నికల తర్వాత వైసీపీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉన్నారు. కీలకమైన సమావేశానికి సైతం గౌర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. దువ్వాడ శ్రీనివాస్ సైతం ఈ సమావేశానికి రాలేదు.
Similar News
News October 13, 2025
ఎచ్చెర్ల: RBK నిర్మాణంపై కలెక్టర్ గ్రీవెన్స్లో ఫిర్యాదు

ఎచ్చెర్ల మండలం, బడివానిపేట గ్రామంలో నిర్మించ తలపెట్టిన RBK కేంద్రంతో చిన్నపిల్లలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన గ్రీవెన్స్లో ఫిర్యాదు అందింది. గ్రామస్థులు ఈ సమస్యను అధికారులకు వివరించారు. నిర్మాణంలో భాగంగా పిల్లర్స్ వేసి ఉంచడంతో 48 మంది కుటుంబాలకు చెందిన పిల్లలు అక్కడ ఆడుకుంటారని, దీంతో ప్రమాదాలు చేసుకుంటున్నాయని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
News October 13, 2025
నేడు విధుల్లో చేరనున్న నూతన ఉపాధ్యాయులు

శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన 528 మంది నూతన ఉపాధ్యాయులు సోమవారం విధుల్లో చేరనున్నారని DEO రవిబాబు తెలిపారు. వీరికి ఆన్లైన్ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించి పాఠశాలలు కేటాయించి, పోస్టింగ్ ఆర్డర్స్ జారీచేశామని వెల్లడించారు. వీరంతా సోమవారం విధుల్లో చేయనుండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందుతుందని భావిస్తున్నామని DEO పేర్కొన్నారు.
News October 13, 2025
SKLM: ‘ధాన్యం రవాణా వాహనాలకు GPS తప్పనిసరి’

రైతులు వద్ద ధాన్యం కొన్న తరువాత రవాణా చేసే ప్రతి వాహనానికి కచ్చితంగా జీపీఎస్ GPS పరికరం అమర్చుకోవాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దీనికోసం ఆసక్తి ఉన్న వాహనదారులు ముందుగా రూ.3068 చెల్లించి GPS యంత్రాన్ని అమర్చుకోవాలని సూచించారు. రైతుసేవా కేంద్రాల వద్ద వాటి వివరాలు నమోదు చేయించుకోవాలని పేర్కొన్నారు.