News June 25, 2024
జగన్ది కిమ్ను తలదన్నే వ్యవహారశైలి: దేవినేని ఉమా

మాజీ సీఎం జగన్ది కిమ్ను తలదన్నే పెత్తందారీ వ్యవహార శైలి అని TDP సీనియర్ నేత దేవినేని ఉమ విమర్శించారు. ‘ఆయన ఇంట్లో ఉంటేనే 986 మందితో రక్షణ. బయటకొస్తే పరదాలతో పాటు 3 రెట్లు అదనం. కుటుంబం, రాజభవనాల రక్షణ కోసం ప్రత్యేక చట్టం. తాడేపల్లి ప్యాలెస్కు దగ్గర్లోని అరాచకాలు పట్టించుకోలేదు. ప్రజల భద్రత గాలికి వదిలేసి విలాసాలు అనుభవించే నువ్వు పెత్తందారివి కాక మరేంటి?’ అని జగన్ను ఆయన Xలో ప్రశ్నించారు.
Similar News
News December 22, 2025
వినియోగదారుల్లో అవగాహన కల్పించాలి: కలెక్టర్

జాతీయ వినియోగదారుల వారోత్సవాల పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సోమవారం విడుదల చేశారు. ఈ నెల 24వ తేదీ వరకు జాతీయ వినియోగదారుల వారోత్సవాలు జరుగుతాయని కలెక్టర్ చెప్పారు. అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని ఆదేశించారు. ఆహార పదార్థాల ప్యాకింగ్, వివిధ రంగుల్లో ఉండే గుర్తులను ఎలా గమనించాలి, ఏ విధమైన చర్యలు చేపట్టాలి అనే వాటిపై అవగాహన కల్పించాలని తెలిపారు.
News December 22, 2025
GNT: క్రిస్మస్ వేళ చిన్న వ్యాపారులకు నిరాశ..!

గుంటూరు జిల్లా క్రిస్మస్ సీజన్ కోసం రెడీమేడ్ దుస్తుల వ్యాపారులు వేచి చూస్తూ ఉంటారు. ఈ పండుగకు అందరూ కొత్త బట్టలు కొనుక్కోవడం ఆనవాయితీ, అయితే చిన్న రిటైల్ దుకాణదారులు ఆన్లైన్, షాపింగ్ మాల్స్ వల్ల సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఆఫర్లు, డిస్కౌంట్లు పెట్టినా చిన్న షాపులలో అనుకున్నంత వ్యాపారం జరగడం లేదని, స్థానిక షాపులను ఆదరించాలని వ్యాపారులు కోరుతున్నారు. దీనిపై మీ COMMENT?
News December 22, 2025
గుంటూరులో క్రీస్తు సేవ.. ఘన చరిత్ర కలిగిన చర్చిలు

క్రీస్తు చూపిన ప్రేమ, శాంతి మార్గంలో గుంటూరు చర్చిలు నడుస్తున్నాయి. AELC ఆధ్వర్యంలో విద్య, వైద్య సేవలు అందుతున్నాయి. 1842లో రెవరెండ్ హయ్యర్ స్థాపించిన సెయింట్ మ్యాథ్యూస్ ఈస్ట్ ప్యారిస్ చర్చికి 150ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. అలాగే 1905లో వెస్ట్ ప్యారిస్ చర్చిని నిర్మించారు. నార్త్ ప్యారిస్ చర్చి 60ఏళ్లుగా సేవలందిస్తోంది. 1940లో ఏర్పాటైన గుంటూరు మేత్రాసనం ఆధ్వర్యంలో పాఠశాలలు, ఆసుపత్రులు నడుస్తున్నాయి.


