News November 22, 2024
జగన్ను ఒక్క సారైనా అసెంబ్లీకి రప్పించండి: ఎమ్మెల్యే ఆది

జగన్ అవినీతిలో ఎస్కోబార్ను కూడా దాటేశారని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘జగన్ను నేను దగ్గర నుంచి చూశా. అతను రాజశేఖర్ రెడ్డి హయాంలోనే రూ.లక్ష కోట్లు సంపాదించారు. ఇప్పుడు ఇంకా పెరిగిపోయి ఉంటుంది‘ అని తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతరం ఆ జగన్ను ఒక్కసారైనా అసెంబ్లీకి రప్పించండి అని ఆదినారయణ రెడ్డి అనగానే సభ్యులతో పాటు సీఎం చంద్రబాబు సైతం నవ్వుకున్నారు.
Similar News
News December 4, 2025
కడప: ప్రైవేట్ ఆస్పత్రుల అనుమతులపై ఆరా.!

కడప జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రుల అనుమతులపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రొద్దుటూరులో ప్రభుత్వ యాజమాన్యంలో జిల్లా ఆస్పత్రి, 6 అర్బన్ హెల్త్ సెంటర్లు, యునాని, హోమియో, ఆయుర్వేదం ఆస్పత్రులు ఉన్నాయి. ప్రైవేట్ యాజమాన్యంలో 108 అల్లోపతి, 30 డెంటల్, 10 పిజియో థెరపీ, 8 హోమియో, 4 ఆయుర్వేదం ఆసుపత్రులు ఉన్నాయి. 38 డయాగ్నస్టిక్ స్కానింగ్ కేంద్రాలు, 13 ల్యాబ్లు ఉన్నాయి.
News December 4, 2025
ముద్దనూరు: వైసీపీ ఎన్నారై విభాగం ప్రధాన కార్యదర్శిగా ప్రదీప్

వైసీపీ ఎన్నారై విభాగం ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ చింత ప్రదీప్ ఎంపికయ్యారు. ఈయన ముద్దనూరు మండల పరిధిలోని రాజు గురువాయిపల్లికి చెందిన వ్యక్తి. బుధవారం సాయంత్రం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రదీప్ను నియమించినట్లు తెలిపారు. పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తానని ప్రదీప్ పేర్కొన్నారు.
News December 3, 2025
కడప: రైలులో లైంగిక దాడి.. నిందితుడికి జీవిత ఖైదు

రైలులో చిన్నారిపై లైంగిక దాడి కేసులో బుధవారం కడప పోక్సో కోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. నిందితుడు రామ్ ప్రసాద్ రెడ్డికి జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ జడ్జి ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. బాధితురాలికి రూ.10.50 లక్షల పరిహారం చెల్లించాలని గుంతకల్ డీఆర్ఎంను ఆదేశించారు. విధుల్లో ఉన్న టీటీఐలపై చర్యలకు సిఫార్సు చేశారు. శిక్ష పడేలా కృషి చేసిన రైల్వే హెడ్ కానిస్టేబుల్ నాగరాజును, పీపీలను ప్రశంసించారు.


