News December 19, 2024

జగన్‌ను కలిసిన శైలజానాథ్.. పార్టీ మార్పుపై ప్రచారం!

image

వైసీపీ అధినేత జగన్‌ను ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ కలిశారు. కర్నూలులో YCP నేత సురేందర్ రెడ్డి కుమార్తె రిసెప్షన్ వేడుక వీరి కలయికకు వేదికైంది. జగన్, శైలజానాథ్ ఇరువురూ ఆప్యాయంగా పలకరించుకుని ఆలింగనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే శైలజానాథ్‌ను జగన్ YCPలోకి ఆహ్వానించారంటూ ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆయన ఆ పార్టీలో చేరే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Similar News

News December 21, 2025

పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం: DMHO

image

పల్స్ పోలియోలో భాగంగా వజ్రకరూరు మండల కేంద్రంలోని PHCని ఆదివారం DMHO డాక్టర్ భ్రమరాంబ దేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పలు రికార్డులు, వార్డులను తనిఖీ చేశారు. అనంతరం పల్స్ పోలియో కేంద్రాలలో పల్స్ పోలియో చుక్కలు ఎంతమంది పిల్లలకు వేశారని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు త్యాగరాజు, గంగాధర్, మండల వైద్యాధికారులు డాక్టర్ తేజస్వి, సర్దార్ వలి ఉన్నారు.

News December 21, 2025

2,84,774 మంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు: DMHO

image

అనంతపురం జిల్లాలో 0-5 ఏళ్ల మధ్యగల 2,84,774 మంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయనున్నట్లు DMHO దేవి తెలిపారు. జిల్లాలోని 82 యూనిట్లలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 1,785 పోలింగ్ బూత్‌లలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం 5,247 మంది సిబ్బందిని నియమించామన్నారు.

News December 21, 2025

2,84,774 మంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు: DMHO

image

అనంతపురం జిల్లాలో 0-5 ఏళ్ల మధ్యగల 2,84,774 మంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయనున్నట్లు DMHO దేవి తెలిపారు. జిల్లాలోని 82 యూనిట్లలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 1,785 పోలింగ్ బూత్‌లలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం 5,247 మంది సిబ్బందిని నియమించామన్నారు.