News October 7, 2024
జగన్ను CMను చేయడమే లక్ష్యం: కాకాణి
YCP అధినేత జగన్ను CMను చేయడమే తన లక్ష్యమని నెల్లూరు జిల్లా YCP అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ కోఆర్డినేటర్ ఆనం విజయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలో ఆదివారం నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. కాకాణి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు, నేతలు పని చేయాలన్నారు. వారికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని కాకాణి భరోసా ఇచ్చారు.
Similar News
News October 7, 2024
జిల్లాలో 350 వాహనాలు స్వాధీనం: నెల్లూరు SP
అనుమతి పొందిన వాహనాల్లోనే ఇసుక రవాణాను అనుమతిస్తామని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. నెల్లూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇసుక యార్డుల వద్ద నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఇప్పటి వరకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 350 వాహనాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు. నిబంధనల మేరకే ఇసుక రవాణా జరగాలన్నారు.
News October 7, 2024
నెల్లూరులో గజలక్ష్మిగా శ్రీ రాజరాజేశ్వరి
నెల్లూరు నగరంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. ఐదో రోజైన సోమవారం అమ్మవారు శ్రీ గజలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. మరోవైపు ఆలయ ప్రాంగణంలోని శ్రీ సుందరేశ్వర స్వామి సన్నిధిలోనూ విశేష అభిషేకాలు, పూజలు జరుగుతున్నాయి.
News October 7, 2024
కావలి: చికిత్స పొందుతూ ZPTC మృతి
గుడ్లూరు ZPTC సభ్యుడు కొరిసిపాడు బాపినీడు(56) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. కొంత కాలంగా కావలిలో నివాసం ఉంటున్న ఆయన గత ఎన్నికల్లో YCP తరఫున ZPTC సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఇటీవలె రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగిన ఆయనకు అప్పుల బాధలు ఎక్కువ అయ్యాయి. దీంతో ఒత్తిడి పెరిగి పురుగు మందు తాగాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలిచంగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కావలి పోలీసులు కేసు నమోదు చేశారు.