News February 3, 2025
జగన్పై హోం మంత్రి అనిత విమర్శలు

గీత కులాలకు మద్యం షాపులు కేటాయించడం నచ్చని జగన్ వైసీపీ న్యాయవాదులతో కేసులు వేయించారని హోంమంత్రి వంగలపూడి అనిత ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. గీత కులాల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా 335 మద్యం దుకాణాలను వారికి కూటమి ప్రభుత్వం కేటాయించిందన్నారు. దీనిపై కోర్టుకు వెళ్లిన జగన్ను ఎందుకు అడ్డుకుంటున్నావని ఆ కులాల వారు ప్రశ్నిస్తున్నారని అన్నారు.
Similar News
News November 19, 2025
మావోయిస్టు నేత కొయ్యడ సాంబయ్య ఎక్కడ..!?

మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ఎన్కౌంటర్, చీఫ్ తిప్పిరి తిరుపతి అంగరక్షకుల అరెస్ట్ నేపథ్యంలో ములుగు(D) చెందిన కొయ్యడ సాంబయ్య @ఆజాద్ ఎక్కడ..? అనే ప్రశ్న వినిపిస్తోంది. ఈనెల 14న ఆయనతో పాటు గోదావరిఖనికి చెందిన సికాస ఆర్గనైజర్ అశోక్ లొంగిపోయే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు పోలీసు వర్గాలు వారి అరెస్ట్ /లొంగుబాటును నిర్ధారించలేదు. దీంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
News November 19, 2025
నవంబర్ 19: చరిత్రలో ఈ రోజు

*1828: స్వాతంత్య్ర పోరాట యోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి జననం
*1917: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జననం
*1960: సినీ నటుడు శుభలేఖ సుధాకర్ జననం
*1975: మాజీ విశ్వ సుందరి, నటి సుస్మితా సేన్ జననం
*అంతర్జాతీయ పురుషుల దినోత్సవం
*ప్రపంచ టాయిలెట్ దినోత్సవం
News November 19, 2025
KNR: స్థానిక సమరం షురు.. వచ్చే నెలలో ఎన్నికలకు క్యాబినెట్ పచ్చజెండా

బీసీ రిజర్వేషన్లపై ప్రతిష్ఠంభన సోమవారంతో వీడగా, ఇక పల్లెల్లో స్థానిక సమరం షురూ కానుంది. డిసెంబర్ నెలలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు సోమవారం జరిగిన క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కేవలం పార్టీపరంగా బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించడానికి నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,216 గ్రామ పంచాయతీలు, 60 జడ్పీటీసీ, 646 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.


