News June 12, 2024

జగన్మోహన్ రెడ్డిని కలిసిన శ్రీకాకుళం వైసీపీ నేతలు

image

సార్వత్రిక ఎన్నికలలో ఘోర ఓటమి పాలైన వైసిపి పార్టీ శ్రేణులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మ్మెల్సీ నర్తు రామారావు మాట్లాడుతూ.. ఎన్నికలలో ఓడిపోయినంత మాత్రాన ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి చావలేదని ప్రజా సమస్యల పట్ల ఆయన పోరాడుతారని తెలియజేశారు.

Similar News

News December 4, 2025

గర్భస్థ లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం: DM&HO

image

గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని DM &HO అనిత స్పష్టం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం లింగ ఆధారిత హింస నివారణ, మెడికో లీగల్ కేర్‌పై శిక్షణ కార్యక్రమం జరిగింది. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న హింసలను అరికట్టి, లింగ వివక్ష చూపరాదని డీఎంహెచ్వో తెలియజేశారు.

News December 3, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

➤కోటబొమ్మాళిలో జేసీ ఆకస్మిక తనిఖీ
➤పాతపట్నం: లగేజీ ఆటో బోల్తా.. బాలుడికి గాయాలు
➤మనుషుల నుండి Scrub Typhus వ్యాపించదు: DMHO
➤శ్రీకాకుళం: ప్రజా ఉద్యమంపై ఉక్కుపాదం వద్దు
➤రైతుసేవలో కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే బగ్గు
➤మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే శిరీష
➤మందస: నరకాన్ని తలపిస్తున్న రహదారులు

News December 3, 2025

శ్రీకాకుళం: ‘స్ర్కబ్ టైఫస్ వ్యాధి..పరిశుభ్రతతో దూరం

image

‘స్ర్కబ్ టైఫస్’ వ్యాధి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శ్రీకాకుళం(D) కొత్తూరు, గార, హిరమండలంలో 10 రోజుల క్రితం కొంతమంది దీని బారిన పడ్డారు. ఎన్ని కేసులు నమోదయ్యాయో అధికార ప్రకటన రావాల్సి ఉంది. అపరిశుభ్ర ప్రాంతాల్లో నల్లిని పోలిన చిన్న పురుగు పెరుగుతోంది. ఇది కుట్టడంతో ఈ వ్యాధి వ్యాపిస్తోందని, తీవ్ర జ్వరం, అలసట, జలుబు ఉంటే తక్షణం చికిత్స తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. పరిశుభ్రత పాటించాలన్నారు.