News June 12, 2024

జగన్మోహన్ రెడ్డిని కలిసిన శ్రీకాకుళం వైసీపీ నేతలు

image

సార్వత్రిక ఎన్నికలలో ఘోర ఓటమి పాలైన వైసిపి పార్టీ శ్రేణులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మ్మెల్సీ నర్తు రామారావు మాట్లాడుతూ.. ఎన్నికలలో ఓడిపోయినంత మాత్రాన ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి చావలేదని ప్రజా సమస్యల పట్ల ఆయన పోరాడుతారని తెలియజేశారు.

Similar News

News December 21, 2025

ఇటుకల బట్టీలు వద్ద పిల్లలకు పోలియో చుక్కలు వేసిన Dy DMHO

image

పలాస మండలం బుడంబో కాలనీ వద్ద ఉన్న ఇటుకల బట్టీలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు ఆదివారం పోలియో చుక్కలను డిప్యూటీ డీఎంఎం‌హెచ్ ఓ మేరీ కేథరిన్ వేశారు. పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు పిల్లలు ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి చుక్కలు వేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. భవిష్యత్తులో పోలియో వ్యాది బారిన పడకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు.

News December 21, 2025

SKLM: ‘చిన్నారులకు పోలియో రక్షణ కవచం’

image

జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులను పోలియో రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఎచ్చెర్లలోని పూడివలసలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 1,55,876 మంది చిన్నారులకు చుక్కలు వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

News December 21, 2025

శ్రీకాకుళం జిల్లా TDP అధ్యక్షుడిగా రమేశ్.!

image

శ్రీకాకుళం జిల్లా TDP అధ్యక్షుడిగా మొదలవలస రమేష్‌ను పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని ఎప్పటి నుంచో సీఎం చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రమేశ్ జెండా పట్టి జిల్లా TDPకి పునర్వైభవానికి తీసుకొచ్చారని పార్టీ శ్రేణులు చెప్పుకొచ్చారు.