News January 30, 2025

జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు: కాటసాని

image

గత ప్రభుత్వ హయాంలో తమ అధినేత వైఎస్ జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చారని YCP నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి పేర్కొన్నారు. కరోనా, ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకున్నా.. ప్రజలు తమపై విశ్వసనీయత కోల్పోకూడదని ఇచ్చిన హామీ మేరకు మేనిఫెస్టోను జగన్ అమలు చేశారన్నారు. 40 ఏళ్ల అనుభవమున్న CBN.. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదని తెలిసే ఎలా హామీలు ఇచ్చారని ప్రశ్నించారు.

Similar News

News December 7, 2025

కొడంగల్: అభ్యర్థులకు కోవర్టుల టెన్షన్..?

image

పంచాయతీ ఎన్నికల సమరం వేళ, ప్రధాన పార్టీల అభ్యర్థులకు ‘కోవర్టుల’ సమస్య గుబులు పుట్టిస్తోంది. పార్టీల్లో అత్యంత రహస్యంగా చర్చించుకున్న వ్యూహాలు క్షణాల్లో ప్రత్యర్థులకు చేరుతుండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తాము మాట్లాడుకున్న విషయాలు లీకవుతుండటంతో ప్రత్యర్థులు వెంటనే అప్రమత్తమై ప్రణాళికలు మార్చుకుంటున్నారు. ఈ ‘లీకు వీరుల’ వ్యవహారంతో నాయకులు ఎవరు నమ్మకస్తులో తెలియక తర్జనభర్జన పడుతున్నారు.

News December 7, 2025

సంకటహర చతుర్థి ప్రత్యేకత ఏంటంటే?

image

ఇవాళ వినాయకుడిని పూజిస్తే జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ‘ఇవాళ సాయంత్రం 6.25 గంటలకు చతుర్థి ప్రారంభమయ్యి సోమవారం సాయంత్రం 4.03 గంటలకు ముగుస్తుంది. ఈరోజు వినాయకుడిని గరికతో పూజించడం విశేషం. చంద్ర దర్శనం తర్వాత వినాయక పూజ చేసుకోవడం శుభప్రదం. సంకటహర చతుర్థి వ్రతాన్ని చతుర్థి తిథిరోజు 3, 5, 11, 21 నెలలపాటు ఆచరించాలి. దీనిని బహుళ చవితి రోజు ప్రారంభించాలి’ అని పండితులు చెబుతున్నారు.

News December 7, 2025

ఈ ఆలయాలకు వెళ్తే..

image

మహారాష్ట్రలోని శని సింగ్నాపూర్ శని దోష నివారణకు చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఊర్లో ఇళ్లు, షాపులకు తలుపులు ఉండవు. న్యాయాధిపతి శని దేవుడి మహిమ వల్ల ఇక్కడ దొంగతనాలు జరగవని నమ్ముతారు. శని దోషం ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శిస్తే శని దోషం తొలగిపోతుందని పండితులు చెబుతారు. శని ధామ్(ఢిల్లీ), కోకిలవ ధామ్(UP), తిరునల్లార్(తమిళనాడు) ఆలయాలను దర్శించడం వల్ల కూడా శని గ్రహ ప్రభావం తగ్గుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.