News January 30, 2025

జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు: కాటసాని

image

గత ప్రభుత్వ హయాంలో తమ అధినేత వైఎస్ జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చారని YCP నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి పేర్కొన్నారు. కరోనా, ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకున్నా.. ప్రజలు తమపై విశ్వసనీయత కోల్పోకూడదని ఇచ్చిన హామీ మేరకు మేనిఫెస్టోను జగన్ అమలు చేశారన్నారు. 40 ఏళ్ల అనుభవమున్న CBN.. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదని తెలిసే ఎలా హామీలు ఇచ్చారని ప్రశ్నించారు.

Similar News

News December 15, 2025

3 సార్లు ‘ఓట్ చోరీ’ చేశారు.. రాహుల్‌కు BJP కౌంటర్

image

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోరీ ఆరోపణలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ‘ఎక్కువ మద్దతు ఉన్న సర్దార్ పటేల్‌ స్థానంలో నెహ్రూ ప్రధాని అయినప్పుడు ఓట్ చోరీ జరిగింది. కోర్టు తీర్పు తర్వాత కూడా ఇందిరా గాంధీ ఎన్నికవడం వివాదాస్పద అధ్యాయంగా చరిత్రలో నిలిచిపోయింది. సోనియా గాంధీ భారత పౌరసత్వం లేకుండానే ఓటరు అయ్యారు’ అని ట్వీట్ చేసింది. రాహుల్ ఫేక్ ప్రాపగండాను తాము క్లీన్ చేస్తున్నామని మండిపడింది.

News December 15, 2025

హుజూరాబాద్: 5 మండలాల్లో నిషేధాజ్ఞలు అమలు: CP

image

​KNR పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 17న మూడో దశ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు CP గౌష్ ఆలం తెలిపారు. 144 సెక్షన్ 48 గంటల పాటు వీణవంక , ఇల్లందకుంట, జమ్మికుంట, హుజూరాబాద్, వి.సైదాపూర్ మండలాల పరిధిలో అమలులో ఉంటాయన్నారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడం లేదా సమావేశం కావడాన్ని పూర్తిగా నిషేధించినట్లు చెప్పారు.

News December 15, 2025

శ్రీవారి బ్రహ్మోత్సవాల విశిష్టత

image

శ్రీవారి బ్రహ్మోత్సవాలను సాక్షాత్తూ బ్రహ్మే నిర్వహిస్తాడని నమ్మకం. అందుకే వీటిని బ్రహ్మోత్సవాలు అంటారు. ఈ ఉత్సవాల్లో ముందు నడిచేది బ్రహ్మ రథమే. ఈ వేడుకలు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగుతాయి. నారాయణుడికి సూర్యుడు, చంద్రుడు, గరుత్మంతుడు, శేషుడు, హనుమంతుడు వంటి దేవతలు, పక్షులు, జంతువులు వాహన సేవ చేస్తాయి. ఇది ప్రకృతిలోని సర్వశక్తులు, సకల జీవులు స్వామివారికి సేవ చేయడాన్ని సూచిస్తుంది. <<-se>>#VINAROBHAGYAMU<<>>