News February 19, 2025

జగన్ నాసిరకం మద్యం అమ్మించాడు: మంత్రి స్వామి

image

జగన్ జే ట్యాక్స్ కోసం నాసిరకం మద్యంతో పేదల ప్రాణాలు తీశాడని మంత్రి స్వామి అన్నారు. నాటు సారా నిర్మూలనపై బుధవారం ఒంగోలులో జరిగిన నవోదయం 2.0 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, నాటుసారా, మద్యం విచ్చలవిడిగా విక్రయించారని ధ్వజమెత్తారు. మారుమూల గ్రామాల్లో సైతం గంజాయి, డ్రగ్స్ దోరేకవన్నారు. కూటమి పాలనలో గంజాయి, డ్రగ్స్‌ని అరికట్టేందుకు ఈగల్ వ్యవస్థని తెచ్చామన్నారు.

Similar News

News January 4, 2026

మార్కాపురం జిల్లాలో మొదటిసారి పరిష్కార వేదిక

image

మార్కాపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ రాజాబాబు శనివారం తెలిపారు. మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గ ప్రజలు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మార్కాపురం జిల్లాకు సంబంధించిన అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారన్నారు. 5వ తేదీ జరగవలసిన రెవెన్యూ క్లినిక్ వాయిదా వేశామన్నారు.

News January 4, 2026

మార్కాపురం SP కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జనవరి 5వ తేదీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ SP హర్షవర్ధన్ రాజు తెలిపారు. స్థానిక జిల్లా కార్యాలయంలో జరుగుతున్న పనులను శనివారం ఇన్న్‌ఛార్జ్ ఎస్పీ పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. మొదటిసారి జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News January 4, 2026

మార్కాపురం SP కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జనవరి 5వ తేదీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ SP హర్షవర్ధన్ రాజు తెలిపారు. స్థానిక జిల్లా కార్యాలయంలో జరుగుతున్న పనులను శనివారం ఇన్న్‌ఛార్జ్ ఎస్పీ పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. మొదటిసారి జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.