News April 7, 2025

జగన్ పర్యటనను అడ్డుకుంటాం: MRPS

image

మాజీ సీఎం వైఎస్ జగన్ రాప్తాడు నియోజకవర్గ పర్యటనను అడ్డుకుంటామని MRPS క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ బీసీఆర్ దాస్ హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మద్దతు ఇచ్చిన తర్వాతే జిల్లా పర్యటనకు రావాలని స్పష్టం చేశారు. మండలిలో ఈ బిల్లుకు మద్దతు ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. తమ నేతలతో కలిసి జగన్ పాపిరెడ్డి పర్యటనను అడ్డుకుంటామని ప్రకటన విడుదల చేశారు.

Similar News

News October 21, 2025

HYD: సజ్జనార్ సార్.. పోలీసులకు రూల్స్ ఉండవా..?

image

HYDలో సాధారణ ప్రజలు హెల్మెట్ లేకుండా బైక్‌లు నడిపితే వెంటనే ట్రాఫిక్ పోలీసులు చలానా విధిస్తున్నారు. చలానా పడితే రోడ్డు పక్కన ఆపి తక్షణమే జరిమానా కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. కానీ అదే పోలీసులు స్వయంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న దృశ్యాలు తరచూ నగరంలో కనిపిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ‘సజ్జనార్ సార్ మాకో న్యాయం, పోలీస్‌లకో న్యాయమా?’ అని ప్రశ్నిస్తున్నారు.

News October 21, 2025

అతి భారీ వర్ష సూచన.. స్కూళ్లకు సెలవు

image

AP: అతి భారీ వర్ష సూచన నేపథ్యంలో నెల్లూరు జిల్లా అధికారులు రేపు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. రేపు ప్రకాశం, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని APSDMA వెల్లడించింది. ఈ నేపథ్యంలో వర్షాలు పడే అవకాశమున్న మిగతా జిల్లాల్లోనూ పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని పేరెంట్స్, స్టూడెంట్స్ కోరుతున్నారు.

News October 21, 2025

HYD: సరోజినీ దేవి ఆస్పత్రికి క్యూకట్టిన బాధితులు

image

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దీపావళి సందర్భంగా టపాసుల మోత మోగించారు. దీంతో ‎బాణసంచా బాధితులతో సరోజినీ దేవి ఆస్పత్రి నిండిపోయింది. ‎నిర్లక్ష్యంగా టపాసులు కాల్చడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ‎సరోజినీ దేవి హాస్పిటల్‌లో సుమారు 70 మంది బాధితులు కాలిన గాయాలతో చేరారు. ‎గాయపడిన వారిలో 20 మంది చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం.