News April 7, 2025

జగన్ పర్యటనను అడ్డుకుంటాం: MRPS

image

మాజీ సీఎం వైఎస్ జగన్ రాప్తాడు నియోజకవర్గ పర్యటనను అడ్డుకుంటామని MRPS క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ బీసీఆర్ దాస్ హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మద్దతు ఇచ్చిన తర్వాతే జిల్లా పర్యటనకు రావాలని స్పష్టం చేశారు. మండలిలో ఈ బిల్లుకు మద్దతు ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. తమ నేతలతో కలిసి జగన్ పాపిరెడ్డి పర్యటనను అడ్డుకుంటామని ప్రకటన విడుదల చేశారు.

Similar News

News November 16, 2025

HYD: వ్యర్థాలపై యోగా.. ఎంటనుకుంటున్నారా?

image

రోడ్డు పక్కన నిర్మాణ వ్యర్థాలపై వ్యక్తి యోగా చేయటం ఏంటని అనుకుంటున్నారా? ఇది నిజమే. శేర్లింగంపల్లి జోన్ కల్వరి టెంపుల్ రోడ్డులో ఓవైపు నిర్మాణ వ్యర్థాల, మరోవైపు డ్రైనేజీ సిల్ట్ రోడ్డుకు ఇరుపక్కల మీటర్ల కొద్ది ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో సూర్య కిరణాలు శరీరాన్ని తాకేలా ఆ వ్యర్థాలపై యోగా చేస్తూ పరిస్థితిని వివరించారు.

News November 16, 2025

KNR: దివ్యాంగురాలి అనుమానాస్పద మృతి

image

KNRలోని వావిలాలపల్లిలో శనివారం దివ్యాంగురాలైన అర్చన(15) అనుమానాస్పదంగా మృతిచెందింది. ఆమె సోదరుడు అశ్రిత్ పరిస్థితి విషమంగా ఉంది. తల్లి కిరాణా షాప్‌కు వెళ్లి వచ్చేసరికి ఇద్దరూ స్పృహ కోల్పోయి కనిపించారు. ఆసుపత్రికి తరలించగా అర్చన చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటన జరిగినప్పటి నుంచి వారి తండ్రి మల్లేషం కనిపించడం లేదు. KNR-3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 16, 2025

‘దమ్ముంటే పట్టుకోండి’ అన్నోడిని పట్టుకున్నారు: సీవీ ఆనంద్

image

TG: Ibomma నిర్వాహకుడు ఇమ్మడి రవిని <<18292861>>అరెస్టు <<>>చేసిన HYD సైబర్ క్రైమ్ పోలీసులను రాష్ట్ర హోం శాఖ స్పెషల్ సీఎస్ CV ఆనంద్ అభినందించారు. ‘‘జూన్ నుంచి సైబర్ క్రైమ్ టీమ్ రేయింబవళ్లు కష్టపడింది. రవిని తప్ప ఈ పైరసీకి సంబంధించిన వాళ్లందరినీ పట్టుకుంది. ‘దమ్ముంటే పట్టుకోండి’ అని పోలీసులకు సవాలు విసిరి, బెదిరించిన వ్యక్తిని ఇప్పుడు అరెస్టు చేసింది. DCP కవిత, CP సజ్జనార్‌కు కంగ్రాట్స్’’ అని ట్వీట్ చేశారు.