News June 20, 2024
జగన్ పాలనలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తం: MLC

జగన్ పాలనలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ అన్నారు. పార్వతీపురంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం జీవో 117 తీసుకువచ్చి పాఠశాలలను నాశనం చేసిందన్నారు. కొత్త ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయని, ఉపాధ్యాయులు ఫ్రెండ్లీగా ఉండాలని ఆకాక్షించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం 117 జీవోను రద్దు చేస్తేనే విద్యావ్యవస్థ మెరుగుపడుతుందన్నారు.
Similar News
News November 22, 2025
SERP పనితీరుపై మంత్రి కొండపల్లి సమీక్ష

SERP పనితీరుపై అమరావతి సచివాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) పనితీరు, రైతుల కోసం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్ల ఏర్పాటు అంశాలపై చర్చించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు రూ.16,846 కోట్లు రుణాలు మంజూరయ్యాయని, 2026 మార్చి నాటికి రూ.32,322 కోట్లు అందేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
News November 22, 2025
ఈ నెల 24 నుంచి రైతన్న మీకోసం సర్వే: కలెక్టర్

జిల్లా వ్యాప్తంగా రైతన్న మీకోసం సర్వే ఈ నెల 24 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. జిల్లాలోని 3.50 లక్షల మంది రైతుల ఇళ్లకు వెళ్లి, వారి పొలం వివరాలు, పంటలు, దిగుబడులు, అవసరాలు వంటి సమాచారాన్ని కల్టివేటర్ యాప్ ద్వారా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామానికి టీంలను వెంటనే నియమించి ఇంటింటికీ వెళ్లి జియో-ట్యాగింగ్ చేయాలని సూచించారు.
News November 22, 2025
ఈ నెల 24 నుంచి రైతన్న మీకోసం సర్వే: కలెక్టర్

జిల్లా వ్యాప్తంగా రైతన్న మీకోసం సర్వే ఈ నెల 24 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. జిల్లాలోని 3.50 లక్షల మంది రైతుల ఇళ్లకు వెళ్లి, వారి పొలం వివరాలు, పంటలు, దిగుబడులు, అవసరాలు వంటి సమాచారాన్ని కల్టివేటర్ యాప్ ద్వారా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామానికి టీంలను వెంటనే నియమించి ఇంటింటికీ వెళ్లి జియో-ట్యాగింగ్ చేయాలని సూచించారు.


