News June 20, 2024
జగన్ పాలనలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తం: MLC

జగన్ పాలనలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ అన్నారు. పార్వతీపురంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం జీవో 117 తీసుకువచ్చి పాఠశాలలను నాశనం చేసిందన్నారు. కొత్త ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయని, ఉపాధ్యాయులు ఫ్రెండ్లీగా ఉండాలని ఆకాక్షించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం 117 జీవోను రద్దు చేస్తేనే విద్యావ్యవస్థ మెరుగుపడుతుందన్నారు.
Similar News
News November 16, 2025
1100 కాల్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

అర్జీదారులు ‘మీ కోసం కాల్ సెంటర్ 1100’ సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేయవచ్చన్నారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్ను సంప్రదించవచ్చని సూచించారు.
News November 16, 2025
చలికాలంలో స్కిన్ అలర్జీలు రాకుండా చూసుకోవాలి: డా.వెంకటాచలం

చలికాలంలో స్కిన్ అలర్జీలు రాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మహారాజా సర్వజన ఆసుపత్రి డెర్మటాలజీ హెచ్ఓడీ డా.వెంకటాచలం ఆదివారం తెలిపారు. శరీరం పొడిబారకుండా చూసుకోవాలన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయట తిరగకూడదన్నారు. స్నానం చేసిన వెంటనే గ్లిజరిన్ ఆయిల్ లేదా కొబ్బరినూనె రాసుకోవాలన్నారు. ఆసుపత్రిలోని అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.
News November 16, 2025
ఈ ఏడాది 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలే లక్ష్యం: మంత్రి

జిల్లాలో ధాన్యం సేకరణను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి రైతు తన పంటను అధికారిక కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. గజపతినగరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. గత ఏడాది 3.34లక్షల వేలు మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం, ఈ ఏడాది 4 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించేలా లక్ష్యాన్ని నిర్ణయించినట్లు తెలిపారు.


