News April 25, 2024
జగన్ పాలనలో వెనుకబడిన ఆంద్రప్రదేశ్: రాజ్ నాథ్ సింగ్

సీఎం జగన్ పాలనలో ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, శ్యాండ్ మాఫియాతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎంతో వెనుకబడిందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. బుధవారం రాత్రి అనకాపల్లిలో ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ఆధ్వర్యంలో రోడ్ షో ర్యాలీగా నిర్వహించారు. మోదీ ప్రభుత్వం ఆంధ్రాలో 3,600 కి.మీ మేర జాతీయ రహదారులు నిర్మించారన్నారు. జగన్ వైఫల్యం వలన ఏపీ వెనుకబడి పోయిందన్నారు.
Similar News
News December 5, 2025
ఆయుష్మాన్ భారత్ పథకంలో మధుమేహ రోగులను చేర్చాలి: ఎంపీ

ఆయుష్మాన్ భారత్ పథకంలో టైప్-1 మధుమేహం రోగులను, అవుట్ పేషెంట్ సేవలు కూడా చేర్చాలని ఎంపీ శ్రీ భరత్ పార్లమెంట్ సమావేశాల్లో కోరారు. ఇన్సులిన్, గ్లూకోజ్ లాంటి ముఖ్య ఔషధాలు ప్రజారోగ్య సంస్థల్లో నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇన్సులిన్ ఒక మందు మాత్రమే కాదని, జీవనాధారమన్నారు. వీటి లభ్యత, ధరల సమస్య కారణంగా ఎవరూ ప్రాణం కోల్పోకూడదని, ఈ విషయంలో కేంద్రం తక్షణమే స్పందించాలన్నారు.
News December 5, 2025
విశాఖలో జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్ పోటీలు

ప్రతిష్టాత్మకమైన 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్ పోటీలు విశాఖ వేదికగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15వ తేదీ వరకు ఈ పోటీలకు విశాఖ నగరం ఆతిధ్యం ఇస్తున్నట్లు ఏపీ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ అద్యక్షుడు సుధాకర రెడ్డి తెలిపారు. శుక్రవారం బీచ్ రోడ్డులోని VMRDA పార్క్ స్కేటింగ్ రింక్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. 11 విభాగాలలో జరిగే పోటీలకు 4000 మంది హాజరవుతారన్నారు
News December 5, 2025
విశాఖ: ‘డీఎస్పీగా చెప్పుకొని యువకుడిని కిడ్నాప్ చేశారు’

డీఎస్పీగా చెప్పుకొని యువకుడిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో నలుగురు నిందితులను విజయనగరం రూరల్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 3 కార్లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 23న డెంకాడ వద్ద విశాఖకు చెందిన మహేష్ కుమార్ యాదవ్ను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసులో మరో నలుగురి కోసం గాలింపు కొనసాగుతోందని రూరల్ CI లక్ష్మణ రావు తెలిపారు.


