News March 5, 2025
జగన్ ప్రజా సమస్యలపై మాట్లాడాలి: గొట్టిపాటి

చిత్తశుద్ధి ఉంటే జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. నాడు టీడీపీకి 23 సీట్లు వచ్చాయని మేము ముసుగు వేసుకుని దాక్కోలేదన్నారు. ధైర్యంగా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాటం చేశామన్నారు. ప్రజా సమస్యలపై పోరాడినందుకే కూటమికి అఖండ మెజారిటీ వచ్చిందని పేర్కొన్నారు.
Similar News
News December 9, 2025
బీచ్ రోడ్డులో నేవీ ఉద్యోగుల పరిశుభ్రత కార్యక్రమం

ఆర్కే బీచ్లో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. INS డేగాకు చెందిన నేవీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 30 మంది నావికులు,10 మంది అధికారులు బీచ్ ప్రాంతంలో చెత్తను తొలగించారు. ఈ డ్రైవ్ను స్వచ్ఛత పఖ్వాడాలో భాగంగా చేపట్టినట్లు నేవీ అధికారులు తెలిపారు. తీర ప్రాంతాలను శుభ్రంగా ఉంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.
News December 9, 2025
స్థూల సేంద్రియ ఎరువుల ప్రత్యేక ఏమిటి?

స్థూల సేంద్రియ ఎరువుల్లో పోషకాలు తక్కువ పరిమాణంలో ఉంటాయి. వీటిని ఎక్కువ పరిమాణంలో వాడవలసి ఉంటుంది. వీటి వినియోగంతో నేలలో నీరు ఇంకే స్వభావం, నీరు నిల్వ చేసే గుణం, నీటి పారుదల, నేల ఉష్ణోగ్రత, గాలి ప్రసరణ మెరుగుపడతాయి. ఉదాహరణ: పశువుల ఎరువు, కోళ్లు, మేకల విసర్జన పదార్థాల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులు మొదలైనవి. ఇవి మన ఊళ్లలోనే దొరుకుతాయి. వాటిని వృథాగా వదిలేయకుండా పొలాల్లో వేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
News December 9, 2025
భద్రకాళి ఆలయంలో నకిలీ టికెట్లు.. ఇద్దరు సస్పెన్షన్

<<18509437>>భద్రకాళి ఆలయంలో నకిలీ టికెట్లు<<>> అని Way2Newsలో వచ్చిన కథనంపై ఈవో సునీత స్పందించారు.ఈ మేరకు ఆలయ బుకింగ్ కౌంటర్లో పని చేస్తున్న శరత్, నరేందర్ను సస్పెండ్ చేశారు. అనంతరం అర్చకులు, సిబ్బందితో ఆమె సమావేశం ఏర్పాటు చేశారు. భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని ఈవో ఆదేశించారు.పూజ కార్యక్రమాల అనంతరం భక్తులకు నచ్చితే తోచిన సంభావణ మాత్రమే ఇవ్వాలని, ఎవరైనా డిమాండ్ చేస్తే దేవస్థాన కార్యాలయంలో ఫిర్యాదు చేయాలన్నారు.


