News March 5, 2025
జగన్ ప్రజా సమస్యలపై మాట్లాడాలి: గొట్టిపాటి

చిత్తశుద్ధి ఉంటే జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. నాడు టీడీపీకి 23 సీట్లు వచ్చాయని మేము ముసుగు వేసుకుని దాక్కోలేదన్నారు. ధైర్యంగా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాటం చేశామన్నారు. ప్రజా సమస్యలపై పోరాడినందుకే కూటమికి అఖండ మెజారిటీ వచ్చిందని పేర్కొన్నారు.
Similar News
News November 20, 2025
సత్యసాయి రూ.100 నాణెం.. ఇలా కొనొచ్చు!

పుట్టపర్తి సత్యసాయి బాబా సేవలను స్మరించుకుంటూ ప్రధాని మోదీ విడుదల చేసిన <<18336129>>రూ.100<<>> స్మారక నాణేన్ని సొంతం చేసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ కాయిన్ను ఎక్కడి నుంచి ఎలా కొనుగోలు చేయాలనే విషయమై ఆరా తీస్తున్నారు. www.indiagovtmint.in అనే వెబ్సైట్ ద్వారా ఈ నాణేలను కొనుగోలు చేయొచ్చు. ఒక్కో కాయిన్ ధర రూ.5,280గా నిర్ణయించారు.
News November 20, 2025
ములుగు జిల్లాలో గుప్త నిధుల కలకలం..?

ములుగు జిల్లాలో గుప్తనిధుల కలకలం చర్చనీయాంశంగా మారింది. మంగపేట(M)కి చెందిన కొందరు ఇటీవల మహారాష్ట్రలోని ఓ మారుమూల గ్రామానికి వెళ్లి ఓ ఇంట్లో తవ్వకాలు జరపగా, బంగారం దొరికినట్లు సమాచారం. వాటి విలువ రూ.కోట్లల్లో ఉంటుందని తెలుస్తోంది. వారితో పాటు వెళ్లిన కొందరికి వాటా ఇవ్వకపోవడంతో ఈ విషయం బయటికి పొక్కింది. ఆనోట ఈనోట తిరిగి, పోలీసుల దాకా చేరినట్లు తెలుస్తోంది. SP విచారణ ప్రారంభించినట్లు సమాచారం.
News November 20, 2025
ఇస్రోలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

<


