News December 5, 2024

జ‌గ‌న్ మ‌రో నాట‌కానికి సిద్ద‌మౌతున్నారు: బాలాజీ

image

అసెంబ్లీకి వెళ్లకుండా వీధి నాట‌కాలు ఆడిన వైసీపీ అధినేత జ‌గ‌న్ మ‌రో నాట‌కానికి సిద్ద‌మౌతున్నార‌ని జ‌న‌సేన సెంట్రల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ బాలాజి అన్నారు. గురువారం ఆయ‌న కార్యాల‌యంలో మాట్లాడుతూ.. జగన్ ప్రజల పక్షాన కూటమి ప్రభు­త్వంపై పోరాటం చేయడానికి సిద్ద‌మౌతున్న‌ట్లు ప్ర‌క‌టించార‌ని, దీని ద్వారా కూట‌మి ప్ర‌భుత్వంపై బుర‌ద‌జ‌ల్లుడు కార్య‌క్ర‌మాన్ని కొన‌సాగించ‌నున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Similar News

News January 20, 2025

గుంటూరులో నేటి నుంచి పశు వైద్య శిబిరాలు

image

ఈ నెల 20 నుంచి 31వ తేదీ వరకు పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి ఓ.నరసింహారావు వెల్లడించారు. ఈ మేరకు శిబిరానికి సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ నాగలక్ష్మీ ఆవిష్కరించారని తెలిపారు. జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. ప్రతీ మండలంలో రెండు బృందాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తామని, సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News January 19, 2025

గుంటూరు: బిడ్డతో సహా తల్లి సూసైడ్

image

విజయవాడ నుంచి చెన్నై వెళ్లే నేషనల్ హైవే సమీపంలో బుడంపాడు వద్ద రైల్వే ట్రాక్‌పై రైలు కిందపడి ఓ మహిళ తన బిడ్డతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మృతురాలు లైట్ గ్రీన్ కలర్ టాప్, వంకాయ రంగు ప్యాంటు గల పంజాబీ డ్రెస్ ధరించి ఉందని, పాప సిమెంటు రంగు టీ షర్టు ధరించి ఉన్నదని గుంటూరు GRP సబ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణరెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 19, 2025

మస్కట్‌లో కడప వ్యక్తి మృతి.. స్పందించిన లోకేశ్

image

కడప బిస్మిల్లా నగర్‌కు చెందిన షేక్ మొహమ్మద్ అనీష్ అన్సారీ ఉపాధి నిమిత్తం మస్కట్ వెళ్లి గుండెపోటుతో మరణించాడు. మృతదేహాన్ని తెప్పించేందుకు సాయం చేయాలని SM ద్వారా ఓ వ్యక్తి మంత్రి లోకేశ్‌కు విన్నవించుకున్నారు. స్పందించిన లోకేశ్ ‘జీవనోపాధి కోసం మస్కట్ వెళ్లిన అన్సారీ మృతి చెందటం అత్యంత బాధాకరం. వారిని స్వదేశానికి రప్పించేందుకు సాధ్యమైన ఏర్పాట్లు చేస్తాం. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలి అని’ అన్నారు.